...
...
Next Story

SCR Weekly Special Trains : తెలుగు ప్రయాణికులకు శుభవార్త - కాచిగూడ, కర్నూల్ మీదుగా వీక్లీ స్పెషల్ ట్రైన్స్..! వివరాలు

SCR Weekly Special Trains : వేసవి ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. కాచిగూడ మీదుగా ప్రత్యేక వారంతపు రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.

Published on: Jun 6, 2026, 14:33:25 IST
Advertisement

SCR Weekly Special Trains : వేసవి సెలవులు ఉండటంతో రైల్వే స్టేషన్లలో రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ క్రమంలో ప్రయాణాలను మరింత సులభతరం చేస్తూ దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్రయాగ్‌రాజ్ - ఎస్.ఎస్.ఎస్. హుబ్బళ్లి స్టేషన్ల మధ్య వీక్లీ స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. ఈ వారంతపు ప్రత్యేక రైళ్లు కాచిగూడ మీదుగా నడుపుతున్నట్లు పేర్కొంది.

వీక్లీ స్పెషల్ ట్రైన్స్ - వివరాలు :

  • (ప్రయాగ్‌రాజ్ - హుబ్బళ్లి, రైలు నంబర్ 04113): ఈ ప్రత్యేక రైలు ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది. జూన్ 6, 2026 నుంచి జులై 11, 2026 వరకు మొత్తం 6 సర్వీసులను రైల్వే శాఖ కేటాయించింది.
  • (ఎస్‌ఎస్‌ఎస్ హుబ్బళ్లి- ప్రయాగ్‌రాజ్, రైలు నంబర్ 04114 ) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతి మంగళవారం నడుస్తుంది. జూన్ 9, 2026 నుండి జులై 14, 2026 వరకు ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. ఈ రూట్‌లో కూడా 6 సర్వీసులు నడుస్తాయి.
  • ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లలో త్రీ-టైర్ ఏసీ (3AC), స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు. మధ్యతరగతి, సాధారణ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సీట్ల లభ్యతను పెంచారు.

స్టాపింగ్ స్టేషన్లు:

వీక్లీ స్పెషల్ ట్రైన్స్
వీక్లీ స్పెషల్ ట్రైన్స్

రెండు వైపులా ప్రయాణించే ఈ ప్రత్యేక రైళ్లు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ముఖ్య నగరాల మీదుగా సాగుతాయి. ఫతేపూర్, గోవింద్‌పురి, ఇటావా, భింద్, సోని, గ్వాలియర్, శివ్‌పురి, గుణా, బినా, భోపాల్, నాగ్‌పూర్, బల్లార్షా స్టేషన్లలో ఇవి ఆగుతాయి.

అలాగే మన తెలుగు రాష్ట్రాల పరిధిలోని సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, కాజీపేట, కాచిగూడ, మహబూబ్‌నగర్, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, అనంతపురం, ధర్మవరం, హిందూపూర్ మీదుగా ప్రయాణించి.. కర్ణాటకలోని యలహంక, తుమకూరు, అరసికెరె, దావణగెరె, హావేరి స్టేషన్లలో ఆగుతూ గమ్యస్థానానికి చేరుకుంటాయి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ వేసవి ప్రయాణాలను ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe