నదీ జలాల సమస్యలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది. స్వయంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా రంగంలోకి దిగే దిశగా కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ సభలను నిర్వహించే యోచనలో కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా సాగే అవకాశం ఉంది.

నీటి హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ ఇటీవల ఆందోళన చేస్తున్నట్లు ప్రకటించగా… కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీని అసెంబ్లీలో చర్చ చేద్దామని ప్రతి సవాల్ కూడా చేసింది. అయితే ఈసారి జరగబోయే సమావేశాల్లో నీటి హక్కుల అంశంపై ప్రధానంగా చర్చ జరగొచ్చు.
గత రెండేళ్లుగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు ఇటీవల విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ స్పందిస్తూ… రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఇక నుంచి లెక్క మరోలా ఉంటుందని.. కాంగ్రెస్ ప్రభుత్వ తోలు తీస్తామని హెచ్చరించారు.
ఇక కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత అధికార పక్షం నుంచి తీవ్రస్థాయిలో ప్రతిస్పందన వచ్చింది. సీఎం రేవంత్ సహా మంత్రులు కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణకు ఎక్కువ ద్రోహం చేసింది బీఆర్ఎస్ పార్టీనే అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరుకావాలని సవాల్ విసిరారు. ఆధారాలతో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.
నీటి హక్కులతో పాటు మహిళలకు నెలకు రూ .2,500 ఆర్థిక సహాయం, కల్యాణి లక్ష్మీతో పాటు యూరియా సమస్యలపై బీఆర్ఎస్ ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కూడా సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తంగా ఈసారి కూడా సభలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్ గట్టిగానే జరిగే అవకాశం స్పష్టం ఉంది.
{{/usCountry}}నీటి హక్కులతో పాటు మహిళలకు నెలకు రూ .2,500 ఆర్థిక సహాయం, కల్యాణి లక్ష్మీతో పాటు యూరియా సమస్యలపై బీఆర్ఎస్ ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కూడా సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తంగా ఈసారి కూడా సభలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్ గట్టిగానే జరిగే అవకాశం స్పష్టం ఉంది.
{{/usCountry}}