తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా మెుదలయ్యాయి. సీఎం రేవంత్ రెజ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు అయ్యారు. కేసీఆర్ దగ్గరకు వెళ్లి రేవంత్ రెడ్డి బాగున్నారా అని అడిగారు. కాసేపటికే సభ నుంచి కేసీఆర్ వెళ్లిపోయారు. ఆ తర్వాత సభ కాసేపు నడిచింది. అసెంబ్లీని జనవరి 2వ తేదీ వరకు స్పీకర్ వాయిదా వేశారు.

అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మేడిగడ్డ ప్రాజెక్టు మాదిరిగానే హుజురాబాద్ నియోజకవర్గంలోని తనుగుల చెక్ డ్యాం బాంబులు పెట్టి పేల్చేశారని కౌశిక్ రెడ్డి అన్నారు.
దీంతో అసెంబ్లీలో ఆందోళన మెుదలైంది. పౌడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బాంబులు పెట్టి పేల్చారని ఆరోపణలు చేయడం ఏంటని ఎదురుదాడికి దిగారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. రికార్డుల నుంచి ఆ పదాలు తొలగించాలని స్పీకర్ను కాంగ్రెస్ సభ్యుడు నాగరాజు కోరారు.
'నా నియోజకవర్గంలోని తనుగుల చెక్డ్యామ్ను బాంబు పెట్టి పేల్చివేశారు. మేడిగడ్డ మాదిరిగానే చెక్డ్యామ్ను బాంబు పెట్టి పేల్చేశారు. హుజూరాబాద్లో పెద్ద ఆయకట్టు కొట్టుకుపోయింది. రిపేర్ చేస్తే దాదాపు ఏడు వేల ఎకరాలకు నీళ్లు అందుతాయి. వెంటనే ఆ ప్రాజెక్టులను పూర్తి చేయాలి.' అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.
ట్రెజరీ బెంచీల వైపు ఆ ఎమ్మెల్యేలు
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ట్రెజరీ బెంచీల వైపు కూర్చొన్నారు. అరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి ముగ్గురూ అటువైపుగా కూర్చున్నట్టుగా కనిపించారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత వేటు కోసం బీఆర్ఎస్ పిటిషన్పై ఇటీవల అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేశారు. వారు బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్టుగా స్పష్టం చేశారు. కాంగ్రెస్లో చేరినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవని, అనర్హత వేటు పిటిషన్ను కొట్టివేస్తున్నట్టు ప్రకటించారు.
మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎటూ కాకుండా పోయారని అన్నారు. ఏ పార్టీలో ఉన్నారో కూడా.. చెప్పుకోలేకపోతున్నారని చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ డోర్స్ క్లోజ్ అయ్యాయని అన్నారు. ఆ ఎమ్మెల్యేల స్థానంలో కొత్తవారికి అవకాశం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందని, సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 40 శాతం వచ్చాయని గుర్తు చేశారు.
{{/usCountry}}మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎటూ కాకుండా పోయారని అన్నారు. ఏ పార్టీలో ఉన్నారో కూడా.. చెప్పుకోలేకపోతున్నారని చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ డోర్స్ క్లోజ్ అయ్యాయని అన్నారు. ఆ ఎమ్మెల్యేల స్థానంలో కొత్తవారికి అవకాశం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందని, సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 40 శాతం వచ్చాయని గుర్తు చేశారు.
{{/usCountry}}