Jobs For Former Maoists in Telangana : హింసా మార్గాన్ని వీడి… సమాజంలో గౌరవప్రదంగా బతకాలన్న ఆకాంక్షతో జనజీవన స్రవంతిలో కలిసిన గిరిజన యువతకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. నాడు మావోయిస్టు ఉద్యమంలో పాల్గొన్న 20 మంది మాజీ మావోయిస్టులను ‘గిరిదర్శకులు’గా (టూరిస్ట్ గైడ్లు) నియమించింది. మంగళవారం ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్కు భూమి పూజ నిర్వహించిన సందర్భంగా… వీరికి యువకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు.
టూరిజం శాఖ ఆధ్వర్యంలో శిక్షణ…

లొంగిపోయిన మావోయిస్టులకు జీవనోపాధి కల్పించాలన్న ఉద్దేశంతో శిక్షణ ఇచ్చి వారిని గిరిదర్శక్ (టూరిస్ట్ గైడ్) లుగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నియమించారు. తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని ముఖ్యంగా పోలీసు, గిరిజనాభివృద్ధి, పర్యాటక, అటవీ, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలోని పర్యాటక ప్రదేశాల్లో పర్యాటకులకు సహాయపడేలా శిక్షణనిచ్చారు.
- తొలి విడతగా ఎంపిక చేసిన 20 మంది ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులకు సహాయంగా ఈ గిరిదర్శక్లు పనిచేస్తారు.
- పర్యాటకులకు వారు స్థానిక సంస్కృతి, చరిత్రను వివరిస్తారు. అటవీ నియమాలు పాటించేలా చూడటంతో పాటు పర్యాటకులకు అవసరమైన భద్రత కల్పించడంలో ఈ గిరిదర్శక్లు సహాయంగా నిలుస్తారు.
- గిరిజన యువతను సమాజంలో భాగస్వామ్యం చేయడం దీని ప్రధాన ఉద్దేశ్యం. వారిలో మనోధైర్యం కల్పించాలన్న సంకల్పంతో సమగ్ర పర్యాటక అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా చేయడం, గతంలో తీవ్రవాద ప్రభావం ఉన్న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో వారిని ఆ ప్రాంతంలో నియమించారు.
- ఈ గిరిదర్శకులు ప్రత్యేక యూనిఫామ్ల్లో విధులను నిర్వర్తిస్తారు. ఒకప్పుడు మావోయిస్టులకు దారి చూపిన వాళ్లు ఇకనుంచి పర్యాటకులకు దారి చూపిస్తారు.
- గిరి దర్శకులుగా ఎంపిక చేసిన వారికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో 6 నెలల పాటు సాఫ్ట్ స్కిల్స్లో శిక్షణ ఇప్పించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
- సాఫ్ట్ స్కిల్స్తో పాటు వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వాలని…. శిక్షణ కాలంలో వారికి స్కాలర్షిప్ అందించాలని చెప్పారు.
జనజీవన స్రవంతిలోకి రండి - సీఎం రేవంత్ పిలుపు
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. అజ్ఞాతంలో ఉన్న అగ్రనేత గణపతి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. “గణపతి ఆరోగ్యం బాగా లేదని సమాచారం ఉంది. లొంగిపోతే వారికి అవసరమైన వైద్యం అందిస్తాం. అవసరమైన భద్రత కల్పిస్తాం. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. మావోయిస్టులు ఇంకెవరైనా అజ్ఞాతంలో ఉన్నా లొంగిపోవాలి. లొంగిపోయిన వారిని ఆర్థికంగా ఆదుకుంటాం. ప్రభుత్వం పిలుపు మేరకు 2024 నుంచి ఇప్పటివరకు 814 మంది నక్సలైట్లు ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిశారు” అని చెప్పారు.
{{/usCountry}}ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. అజ్ఞాతంలో ఉన్న అగ్రనేత గణపతి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. “గణపతి ఆరోగ్యం బాగా లేదని సమాచారం ఉంది. లొంగిపోతే వారికి అవసరమైన వైద్యం అందిస్తాం. అవసరమైన భద్రత కల్పిస్తాం. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. మావోయిస్టులు ఇంకెవరైనా అజ్ఞాతంలో ఉన్నా లొంగిపోవాలి. లొంగిపోయిన వారిని ఆర్థికంగా ఆదుకుంటాం. ప్రభుత్వం పిలుపు మేరకు 2024 నుంచి ఇప్పటివరకు 814 మంది నక్సలైట్లు ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిశారు” అని చెప్పారు.
{{/usCountry}}