...
...
Next Story

TG Smart Ration Cards : క్యూఆర్ కోడ్‌తో కొత్త రేషన్ కార్డులు రెడీ – త్వరలోనే లబ్ధిదారులకు పంపిణీ..! తాజా అప్డేట్స్ ఇవిగో

Telangana QR Code Ration Card : కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. ఇప్పటికే క్యూఆర్‌ కోడ్‌తో కూడిన రేషన్‌ కార్డుల ప్రింటింగ్‌ పూర్తి కాగా…. వీటిని ఆయా జిల్లాలకు పంపించారు. త్వరలోనే పంపిణీ తేదీలను ఖరారు చేస్తారు.

Published on: Jul 18, 2026, 17:37:31 IST
Advertisement

Telangana QR Code Ration Card : ఆధునిక సాంకేతికతతో కూడిన సరికొత్త 'స్మార్ట్' రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.05 కోట్లకు పైగా కుటుంబాల కోసం క్యూఆర్ కోడ్‌తో (QR Code) కూడిన కార్డులను పంపిణీ చేయనుంది.ఈ కొత్త కార్డుల ప్రింటింగ్ ప్రక్రియ పూర్తి కాగా… పౌరసరఫరాల శాఖ ఇప్పటికే ఈ కార్డులను అన్ని జిల్లాలకు చేరవేసింది.

కొత్త రేషన్ కార్డుల పంపిణీపై అప్డేట్(ఫైల్ ఫొటో)
కొత్త రేషన్ కార్డుల పంపిణీపై అప్డేట్(ఫైల్ ఫొటో)

ఈ సరికొత్త స్మార్ట్ కార్డుల పంపిణీపై అధికారికంగా తేదీ రావాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పంపిణీ తేదీని ఖరారు చేసిన వెంటనే…. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు వీటిని అందజేయనున్నారు. ఆ దిశగా అధికారులు కార్యాచరణను సిద్ధం చేశారు.

స్మార్ట్ గా… సరికొత్తగా…

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పేపర్ రూపం నుంచి ప్లాస్టిక్ కార్డు రూపంలోకి రేషన్ కార్డులు రావడం ఇదే తొలిసారి. వీటిని మన చేతిలో ఉండే క్రెడిట్, డెబిట్ కార్డుల సైజులో ఎంతో రూపొందించారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డుపై లబ్ధిదారుడి (యజమాని) ఫోటోతో పాటు పేరు, చిరునామా స్పష్టంగా ముద్రించారు.

  • ఈ కొత్త కార్డుల వెనుక ఉన్న అసలు మ్యాజిక్ క్యూఆర్ కోడ్. రేషన్ దుకాణానికి వెళ్లినప్పుడు ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు.. ఆ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? అనేది తెలిసిపోతుంది.
  • కార్డులో ఉన్నవారికి ఇప్పటివరకు బియ్యం, గోధుమలు, చక్కెర వంటి రేషన్ వస్తువులు ఏయే నెలల్లో ఎంతెంత పంపిణీ అయ్యాయనే పూర్తి హిస్టరీ కంప్యూటర్ స్క్రీన్‌పై డిస్ ప్లే అవుతుంది.
  • కార్డుదారుడు కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లేదా కార్డు నంబర్ చెప్పి… కుటుంబంలో ఎవరైనా సరే బయోమెట్రిక్ (వేలిముద్ర) వేసి సులభంగా రేషన్ తీసుకోవచ్చు.

ఈ సరికొత్త స్మార్ట్ రేషన్ కార్డుల తయారీకి అయ్యే పూర్తి ఖర్చును పౌరసరఫరాల శాఖే భరిస్తోందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. కొత్త కార్డుల కోసం ప్రజల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయరు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,05,42,188 రేషన్ కార్డులు ఉండగా…. వాటి ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య 3,39,96,239 గా ఉంది. ఈ భారీ డిజిటల్ మార్పుతో రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత మరింత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఈ పంపిణీ పండుగ షురూ కానుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe