వ్యవసాయంలో అత్యాధునిక పరికరాల వాడకం పెరుగుతోంది. దీంతో పనులు చకాచకా అవుతున్నాయి. పంటల్లో చీడపీడల నివారణకు పిచికారీ చేయడానికి డ్రోన్ల వినియోగం ఇటీవల ఎక్కువైంది. రోజంతా చేసే పనిని డ్రోన్లు కొన్ని గంటల్లో చేసేస్తాయి.

వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో రైతులకు డ్రోన్లు, సంబంధిత పరికరాలను రాయితీపై సరఫరా చేయడంతో పాటు, వాటి నిర్వహణలో శిక్షణ కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యూనిట్కు గరిష్టంగా రూ. 4 లక్షలకు లోబడి, 40 శాతం సబ్సిడీని అందిస్తామని అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రతీ యూనిట్కు రూ.4లక్షల సబ్సిడీ దొరుకుతుంది.
వ్యవసాయ కూలీల కొరతను పరిష్కరించడానికి, సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రైతులకు ఖర్చులను తగ్గించడానికి ప్రభుత్వం 40 శాతం సబ్సిడీతో డ్రోన్లను, శిక్షణా సహాయాన్ని అందిస్తుంది. ఈ ప్రక్రియలో రైతు సంఘాలు, సహకార సంస్థలకు ప్రాధాన్యత ఇస్తోంది. రైతులు పురుగుమందులు పిచికారీ చేయడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. మానవ శ్రమతో పోలిస్తే ఈ సాంకేతికత సమయాన్ని ఆదా చేయడమే కాకుండా.. ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది.
అయితే డ్రోన్ల అధిక ధర కారణంగా అన్నదాతలు కొనలేకపోతున్నారు. ఫలితంగా ప్రస్తుతం చాలా మంది రైతులు సహకార సంఘాలు, స్వయం సహాయక బృందాలు, ప్రైవేట్ ఆపరేటర్ల నుండి డ్రోన్లను అద్దెకు తీసుకోవడంపై ఆధారపడుతున్నారు. అద్దె రుసుము గంటకు సుమారు రూ. 400 ఉంటుంది. ఈ సమయంలో డ్రోన్లు దాదాపు నాలుగు నుండి ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కవర్ చేస్తాయి.
తయారీదారు, స్పెసిఫికేషన్లను బట్టి ఒక్కో డ్రోన్ ధర రూ. 9.5 లక్షల నుండి రూ. 11.5 లక్షల మధ్య ఉంటుంది. అందువల్ల వీటిని రైతులు ఎక్కువగా కొనుగోలు చేసేందుకు సబ్సిడీ చాలా కీలకం. అలా అయితేనే అన్నదాతలు వీటివైపు ఆసక్తి చూపిస్తారు. రూ.4లక్షల సబ్సిడీతో రైతులకు ఉపశమనం దక్కనుంది.
ఆర్థిక సహాయంతో పాటు, డ్రోన్ టెక్నాలజీని సురక్షితంగా, సమర్థవంతంగా ఉపయోగించుకునేలా రైతులకు ప్రభుత్వం శిక్షణ కూడా అందిస్తుంది. కేటాయింపులలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు(ఎఫ్పీఓలు), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, స్వయం సహాయక బృందాలకు ప్రాధాన్యత ఇస్తారు.
{{/usCountry}}ఆర్థిక సహాయంతో పాటు, డ్రోన్ టెక్నాలజీని సురక్షితంగా, సమర్థవంతంగా ఉపయోగించుకునేలా రైతులకు ప్రభుత్వం శిక్షణ కూడా అందిస్తుంది. కేటాయింపులలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు(ఎఫ్పీఓలు), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, స్వయం సహాయక బృందాలకు ప్రాధాన్యత ఇస్తారు.
{{/usCountry}}డ్రోన్ల వాడకం వల్ల రైతులు తక్కువ సమయంలో ఎక్కువ ఎకరాల్లో పురుగుమందుల పిచికారీ చేస్తారు. తక్కువ పరిమాణంలోనే పురుగుమందులు సరిపోతాయి. పెట్టుబడి వ్యయం కూడా తగ్గుతుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
పంటలకు సకాలంలో పురుగు మందులు పిచికారీ చేయకపోతే రైతులు ఆర్థికంగా నష్టాలు చూడాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని.. ప్రభుత్వం వ్యవసాయ రంగంలో డ్రోన్ల ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తోంది. డ్రోన్లతో ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేయడం వలన అన్నదాతలకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.