Hyderabad MMTS : హైదరాబాద్ చుట్టూ ఎంఎంటీఎస్, ఫ్యూచర్ రైలు కారిడార్లు!

Hyderabad MMMTS :హైదరాబాద్ చుట్టూ ఎంఎంటీఎస్ విస్తరణ, ఫ్యూచర్ రైలు కారిడార్ల కోసం తెలంగాణ ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే డీపీఆర్‌లను సిద్ధం చేయనున్నాయి. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Published on: Sep 1, 2026, 06:35:36 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (MMTS) విస్తరణ, హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ (RRR) కారిడార్ల వెంబడి రైల్వే టెర్మినళ్ల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కీలక ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్ రైల్వే కనెక్టివిటీకి అవసరమైన భూసేకరణ, బుల్లెట్ రైలు కారిడార్లతో సహా, వంటి అంశాలపై సమగ్ర వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికలను (DPRలు) సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

సచివాలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో కలిసి ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు సంజయ్ జాజు. తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీకి సంబంధించిన 21 కీలక అంశాలను సమీక్షించారు. వీటిలో రైల్వే అండర్‌పాస్‌లు, ఓవర్‌బ్రిడ్జ్‌ల నిర్మాణం, అప్రోచ్ రోడ్ల అభివృద్ధి, రోడ్ల విస్తరణ పనులు, రైల్వే లైన్ల డబ్లింగ్, చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు ప్రజా రవాణా కనెక్టివిటీని మెరుగుపరిచే చర్యలు ఉన్నాయి.

తెలంగాణ ఆర్థిక, పారిశ్రామిక, ప్రాంతీయ అభివృద్ధికి రైలు కనెక్టివిటీ ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ, పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలన్నారు సీఎస్. ప్రాజెక్టులను నిర్దేశిత కాలపరిమితిలోగా పూర్తి చేయాలని ప్రధాన కార్యదర్శి శాఖా అధికారులకు, జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు.

రూ.50,870 కోట్ల అంచనా పెట్టుబడితో 2,023 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 17 రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను పరిశీలన కోసం రైల్వే బోర్డుకు ఇప్పటికే సమర్పించినట్లు ఎస్సీఆర్ అధికారులు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇస్తూ, ప్రాజెక్టుల అమలును ప్రభావితం చేస్తున్న అపరిష్కృత సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలను గుర్తించేందుకు రైల్వే, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సంయుక్త తనిఖీలు నిర్వహించాలని సీఎస్ తెలిపారు.

ఈ సమావేశంలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల పురోగతి, భూసేకరణకు సంబంధించిన సవాళ్లు, వివిధ శాఖల నుండి అవసరమైన పరిపాలనా అనుమతులపై కూడా సమీక్ష జరిగింది. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో పాల్గొన్నవారు చర్చించారు. పీఎం గతిశక్తి కార్యక్రమం కింద నిధులు సమీకరించేందుకు డీపీఆర్‌లను సిద్ధం చేయాలని నిర్ణయించారు.

రాష్ట్రవ్యాప్తంగా రైల్వే ప్రాజెక్టుల అమలును సులభతరం చేసేందుకు పురపాలక పరిపాలన, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (హెచ్‌ఎం‌డబ్ల్యూ‌ఎస్‌ఎస్‌బి), రెవెన్యూ, ఇంధన, రోడ్లు అండ్ భవనాల శాఖల అధికారులు ఎస్సీఆర్‌తో కలిసి పనిచేయాలని సంజయ్ జూజు అన్నారు. ఈ సమావేశానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజ్, నవీన్ మిట్టల్‌తో పాటు ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More