వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించిన సబ్సిడీ నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయనున్నారు. ఈ సరికొత్త విధానాన్ని అమలు చేసే అవకాశాలను పరిశీలించి…. అవసరమైన విధివిధానాలను రూపొందించాలని అధికారులకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
విధివిధానాలు సిద్ధం చేయండి - మంత్రి తుమ్మల

శనివారం హైదరాబాద్లో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రానున్న ఖరీఫ్ సీజన్కు సంబంధించి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. ప్రస్తుతం వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతులు కొనుగోళ్లు చేసిన పనిముట్లకు 40 శాతం సబ్సిడీ నిధులను సదరు కంపెనీలకు అందించే పద్దతి ఉందన్నారు. అలా కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి సబ్సిడీ నిధులను నేరుగా రైతుల ఖాతాలోకి బదిలీ చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అందుకు తగ్గ విధివిధానాలు తయారు చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలో రైతులకు సబ్సిడీపై అందించే పచ్చిరొట్ట విత్తనాలను వచ్చే ఏప్రిల్ నెలాఖరు సిద్ధంగా ఉంచుకోవాలని మంత్రి తుమ్మల సూచించారు. అందుకు తగ్గ ఏర్పాట్లు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు వేదికలలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇందుకు రెడ్కో సంస్థ సహకారం తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు.
మొదట ప్రయోగాత్మకంగా జంగారెడ్డిపల్లి మరియు జనంపేట రైతు వేదికలలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. వాటి పనితీరును పరిశీలించిన తరువాత మొదటి దశలో రాష్ట్రంలోని 1600 రైతు వేదికలలో రెడ్కో ద్వారా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
రానున్న ఖరీఫ్ సీజన్ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి అవసరమైన ఎరువులను ముందుగానే తెప్పించి నిల్వ ఉంచేందుకు ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించాలన్నారు. ఎరువుల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా కూడా ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్రానికి అవసరమైన ఎరువులను ముందుగానే సమకూర్చుకోవాలని తెలిపారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని సూచించారు.
{{/usCountry}}రానున్న ఖరీఫ్ సీజన్ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి అవసరమైన ఎరువులను ముందుగానే తెప్పించి నిల్వ ఉంచేందుకు ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించాలన్నారు. ఎరువుల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా కూడా ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్రానికి అవసరమైన ఎరువులను ముందుగానే సమకూర్చుకోవాలని తెలిపారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని సూచించారు.
{{/usCountry}}దక్షిణ పశ్చిమ రుతుపవనాలు సాధారణంగా ప్రారంభమవుతాయనే అంచనాల నేపథ్యంలో రానున్న ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం సుమారు 60.60 లక్షల హెక్టార్లలో సాగు అయ్యే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఖరీఫ్–2026 సీజన్కు రాష్ట్రానికి 11.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు.