రాష్ట్రంలోని పేద, నిరుద్యోగ మహిళలకు ఆర్థిక స్వాలంబన కల్పించే ఉద్జేశ్యంతో ప్రభుత్వం ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం" కింద దరఖాస్తులను స్వీకరిస్తోంది. స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించేందుకు వీలుగా అర్హులైన వారిని ఈ స్కీమ్ కింద ఎంపిక చేస్తారు.

అయితే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన మహిళలు వెంటనే తమ అప్లికేషన్లను సమర్పించాల్సి ఉంటుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి నేడే (సెప్టెంబర్ 15, 2026) చివరి తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్లైన్ ద్వారానే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
అర్హతలు - ముఖ్య వివరాలు :
- ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే మహిళల వయస్సు 18 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.
- ఇక కుటుంబ వార్షిక రాబడికి సంబంధించి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలకు ప్రత్యేక పరిమితులు విధించారు.
- గ్రామీణ ప్రాంత అభ్యర్థుల కుటుంబ వార్షిక రాబడి రూ. 1.50 లక్షలకు మించకూడదు.
- పట్టణ ప్రాంత అభ్యర్థుల కుటుంబ వార్షిక రాబడి రూ. 2.00 లక్షల లోపు ఉండాలి.
- ఆదాయ ధృవీకరణ పత్రం ఒక సంవత్సరం క్రితం పొందినదై ఉండాలి.
మీ వద్ద ఉండాల్సిన పత్రాలు…
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం
- కుల ధృవీకరణ పత్రం
అర్హత, ఆసక్తి ఉన్న మహిళలు ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా TGOBMMS పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. ఆసక్తిగల అభ్యర్థులు http://tgobmms.cgg.gov.in వెబ్సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.
పథకానికి సంబంధించి మరింత సమాచారం లేదా సందేహాల నివృత్తి కోసం సంబంధిత జిల్లా బీసీ అభివృద్ధి అధికారి లేదా ఈడి బీసీ కార్పొరేషన్ (ED BC Corporation) అధికారులను నేరుగా సంప్రదించవచ్చు,
{{/usCountry}}పథకానికి సంబంధించి మరింత సమాచారం లేదా సందేహాల నివృత్తి కోసం సంబంధిత జిల్లా బీసీ అభివృద్ధి అధికారి లేదా ఈడి బీసీ కార్పొరేషన్ (ED BC Corporation) అధికారులను నేరుగా సంప్రదించవచ్చు,
{{/usCountry}}