రాష్ట్రంలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థుల ఉద్యోగార్హతలు, నైపుణ్యాల కొరతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. విద్యార్థుల సామర్థ్యాలను ఉద్దేశించి ఆయన ఉపయోగించిన 'క్రిమినల్ వేస్ట్' అనే పదంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. తెలంగాణలోని లక్షలాది మంది ఇంజినీరింగ్ విద్యార్థులను సీఎం దారుణంగా అవమానించారని అభిప్రాయపడుతున్నాయి.
సీఎం ఏమన్నారంటే..?

“టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్సేంజ్” లో భాగంగా ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో విద్యా అధ్యయన పర్యటన పూర్తి చేసుకున్న ప్రతినిధులతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ దాశరథి ఆడిటోరియంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన సీఎం… ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల ఉద్యోగార్హతలపై కొన్ని కామెంట్స్ చేశారు.
"రాష్ట్రంలో ప్రతి ఏటా దాదాపు 1.10 లక్షల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు పట్టాలు పుచ్చుకుంటున్నారు. కానీ వారిలో చాలా మంది కనీసం ఒక తెల్ల కాగితంపై ఉద్యోగం కోసం దరఖాస్తు కూడా రాయలేకపోతున్నారు. ఇది క్రిమినల్ వేస్ట్. ఇంజినీరింగ్ చదివానన్న భావనతో చిన్న చిన్న ఉద్యోగాలు చేయడానికి కూడా వారు ముందుకు రావడం లేదు, అలాగని కొత్త నైపుణ్యాలనూ నేర్చుకోవడం లేదు," అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అయితే… తాను విద్యార్థులను తప్పుపట్టడం లేదని, విద్యా విధానంలో ఉన్న లోపాలనే వేలెత్తి చూపుతున్నానని ఆయన స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇంజినీరింగ్ విద్యార్థుల నైపుణ్యాలను తక్కువ చేసి మాట్లాడేందుకు ముఖ్యమంత్రికి ఉన్న అర్హత ఏంటని ఆయన ప్రశ్నించారు.
"తన జీవితంలో ఎప్పుడైనా పోటీ పరీక్ష రాశారా? ఏదైనా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి హాజరయ్యారా? కనీసం ఒక్కరోజైనా ఏదైనా ప్రొఫెషనల్ వాతావరణంలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉందా?" అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కెటిఆర్ ప్రశ్నాస్త్రాలను సంధించారు.
{{/usCountry}}"తన జీవితంలో ఎప్పుడైనా పోటీ పరీక్ష రాశారా? ఏదైనా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి హాజరయ్యారా? కనీసం ఒక్కరోజైనా ఏదైనా ప్రొఫెషనల్ వాతావరణంలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉందా?" అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కెటిఆర్ ప్రశ్నాస్త్రాలను సంధించారు.
{{/usCountry}}రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్ స్పందిస్తూ… కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. "కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గతంలో విద్యార్థులను 'ఇడియట్స్' అని సంబోధిస్తే, ఆయన శిష్యుడైన రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి ఇంజినీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అని ముద్రవేశారు" అని సుభాష్ మండిపడ్డారు.
దేశ వికాసానికి ఇంజినీర్లు వెన్నుముక లాంటి వారని, వారిని అవమానించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ పెద్ద తప్పిదం చేసిందని ఆయన అన్నారు. "తమను తాము జెన్ జీ (Gen Z) కార్యకర్తలుగా చెప్పుకునేవారు ఇప్పుడు స్పందిస్తారా? లేదా తమ రాజకీయ యజమానుల నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు మాత్రమే వారి ఆగ్రహం బయటకు వస్తుందా?" అని ఆయన నిలదీశారు.
సీఎం చేసిన ఈ వ్యాఖ్యలను మరో మాజీ మంత్రి హరీశ్ రావ్ తీవ్రంగా ఖండించారు. “రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అనడం అత్యంత దురదృష్టకరం. మన పిల్లలు ఇంజనీరింగ్ చదివి ఎన్నో దేశాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. వెంటనే ఆ మాటలు వెనక్కి తీసుకోని ఇంజనీరింగ్ విద్యార్థులకు, టీచర్లకు క్షమాపణ చెప్పాలి” అని డిమాండ్ చేశారు.