...
...
Next Story

'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌'కు మీరు కూడా వెళ్లొచ్చు - మీకోసమే ఉచిత బస్సులు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ కు తెలంగాణ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఫ్యూచర్ సిటీ వేదికగా ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వీక్షించేందుకు ప్రజలను అనుమతించటమే కాకుండా సిటీ నుంచి ఉచితంగా బస్సులను కూడా నడపనుంది.

Published on: Dec 4, 2025, 13:14:32 IST
Advertisement

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ - 2025కు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. 4 వేలకుపైగా ప్రముఖలను ఆహ్వానిస్తోంది. వివిద రంగాలకు చెందిన ప్రముఖలనే కాకుండా దేశ ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానాలు అందజేస్తోంది. ఈ సదస్సును అత్యంత విజయవంతం చేయాలని చూస్తోంది.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌

ఈ సదస్సు నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. దేశ ఆర్థిక ప్రగతిలో తోడ్పాటును అందించాలన్న సంకల్పంతో తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రం రూపొందించినట్టు ప్రభుత్వం చెబుతోంది. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలని సమగ్రమైన ప్రణాళికలతో రోడ్ మ్యాప్‌ను రూపొందించినట్టు పేర్కొంటోంది.

రాష్ట్రాన్ని 2034 నాటికి 1 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పం. తెలంగాణను బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే క్రమంలో ముందుకు వెళ్లడానికి ప్రముఖులందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తోంది. బిజినెస్, స్పోర్ట్స్, ఇండస్ట్రీ, అగ్రికల్చర్, టూరిజం... ఇలా అన్ని రంగాల్లో ప్రగతికి అవసరమైన అన్ని అంశాలు పాలసీలో ఉంటాయి.

ఉచితంగా బస్సులు…

ఓవైపు భారీగా ఏర్పాటు చేస్తుడంగా… తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమ్మిట్ కు సామాన్య ప్రజలు కూడా హాజరయ్యేందుకు అనుమతినిచ్చింది. అంతేకాదు హైదరాబాద్ సిటీ నుంచి ఉచితంగా బస్సులను కూడా నడపనుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe