...
...
Next Story

TG Special TET 2026 : ప్రత్యేక టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల - ఈ తేదీల్లో ఎగ్జామ్స్

Telangana Special TET 2026 : తెలంగాణలోని ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు సెప్టెంబరు 8, 9 తేదీల్లో ప్రత్యేక టెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. మొత్తం 24,983 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు.

Published on: Aug 31, 2026, 05:12:09 IST
Advertisement

Telangana Special TET 2026 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. సర్వీసులో ఉన్న టీచర్ల కోసం సెప్టెంబరు 8, 9 తేదీల్లో ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు పరీక్షలకు సంబంధించిన పూర్తి కాలపట్టికను (షెడ్యూల్) పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ఖరారు చేసింది.

తెలంగాణ టెట్ 2026
తెలంగాణ టెట్ 2026

ఈ ప్రత్యేక టెట్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24,983 మంది ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. టీచర్ల అర్హతలు, మాధ్యమాల ఆధారంగా పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ పక్కా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.

పరీక్షల నిర్వహణ షెడ్యూల్ వివరాలు:

  • సెప్టెంబరు 8 (మొదటి రోజు): ఉదయం సెషన్‌లో పేపర్-1 పరీక్ష జరుగుతుంది. మధ్యాహ్నం సెషన్‌లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలకు చెందిన ఉపాధ్యాయులకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు.
  • సెప్టెంబరు 9 (రెండో రోజు) : మధ్యాహ్నం సెషన్‌లో ఇతర మాధ్యమాల (ఉర్దూ, మరాఠీ, కన్నడ తదితర) వారికి పేపర్-2 పరీక్షను పూర్తి చేస్తారు.

సుప్రీంకోర్టు ఉత్తర్వులు, విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు కూడా టెట్ అర్హత తప్పనిసరి కావడంతో ప్రభుత్వం ఈ ప్రత్యేక పరీక్షను ఏర్పాటు చేసింది. పరీక్షకు హాజరవుతున్న ఉపాధ్యాయులు హాల్‌టికెట్లు, ఇతర తాజా సమాచారం కోసం పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలని అధికారులు సూచించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe