Telangana TET Results 2026 : తెలంగాణ టెట్ ఫలితాల విడుదలపై విద్యాశాఖ కసరత్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్రాథమిక కీలు విడుదల కాగా… అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కూడా ముగిసింది. త్వరలోనే ఈ ఫలితాలను ప్రకటించనున్నారు.

విద్యాశాఖ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం…. ఈ ఫలితాలను జూలై 28 నుంచి 31వ తేదీల మధ్య అధికారికంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ దిశగా విద్యాశాఖ కార్యాచరణను సిద్ధం చేసింది. మరోవైపు పరీక్ష రాసిన అభ్యర్థులు ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీలు విడుదలయ్యాయి. రెస్పాన్స్ షీట్లతో పాటు ప్రాథమిక కీని పరిశీలించుకున్న అభ్యర్థుల నుంచి విద్యాశాఖ జూలై 2వ తేదీ వరకు అభ్యంతరాలను కూడా స్వీకరించింది. సేకరించిన అభ్యంతరాలను సబ్జెక్ట్ నిపుణుల కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే తుది కీతో పాటు అభ్యర్థుల మార్కుల వివరాలను, అర్హత సాధించిన వారి జాబితాను బోర్డు ప్రకటించనుంది.
తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టెట్ స్కోర్ అత్యంత కీలకం. జూన్ 16 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ (కంప్యూటర్ ఆధారిత) పద్ధతిలో పేపర్-1, పేపర్-2 పరీక్షలను విద్యాశాఖ విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?
టీజీ టెట్ ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా సులభంగా మార్కులను చూసుకోవచ్చు. ఫలితాల కోసం విద్యాశాఖ ప్రత్యేకంగా అధికారిక పోర్టల్ను అందుబాటులో ఉంచింది.
- మొదటగా అధికారిక వెబ్సైట్ https://tgtet.aptonline.in ను ఓపెన్ చేయాలి.
- హోంపేజీలో కనిపించే 'TG TET June 2026 Results' అనే లింక్పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత ఓపెన్ అయ్యే లాగిన్ పేజీలో అభ్యర్థి తన హాల్ టికెట్ నంబర్ (లేదా అప్లికేషన్ నంబర్), పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయగానే స్క్రీన్పై టెట్ స్కోర్కార్డ్ ప్రత్యక్షమవుతుంది.
- భవిష్యత్తు అవసరాల కోసం అభ్యర్థులు తమ రిజల్ట్ కాపీని డౌన్లోడ్ చేసుకుని, ప్రింట్ అవుట్ తీసుకోవడం మంచిది.
ఈసారి టెట్ పరీక్షల గణాంకాలను పరిశీలిస్తే…. పేపర్-1తో పాటు పేపర్-2లోని సైన్స్, సోషల్ స్టడీస్ విభాగాలకు కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,53,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,15,028 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, మిగిలిన వారు గైర్హాజరయ్యారు.
{{/usCountry}}ఈసారి టెట్ పరీక్షల గణాంకాలను పరిశీలిస్తే…. పేపర్-1తో పాటు పేపర్-2లోని సైన్స్, సోషల్ స్టడీస్ విభాగాలకు కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,53,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,15,028 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, మిగిలిన వారు గైర్హాజరయ్యారు.
{{/usCountry}}ఇక టెట్ పరీక్షలో అర్హత సాధించాలంటే అభ్యర్థులు తమ కేటగిరీని బట్టి కనీస మార్కులను సాధించాల్సి ఉంటుంది. మొత్తం 150 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షలో కటాఫ్ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
- జనరల్ కేటగిరీ (OC) : కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. అంటే 150 మార్కులకు గానూ 90 మార్కులు రావలసి ఉంటుంది.
- వెనుకబడిన తరగతులు (BC) : కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. అంటే 75 మార్కులు వస్తేనే అర్హత సాధించినట్లు ప్రకటిస్తారు.
- ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులు (SC/ST/PwD): కనీసం 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. అంటే 150 మార్కులకు గానూ 60 మార్కులు సాధిస్తే సరిపోతుంది.
- టెట్లో సాధించిన మార్కులకు ఉపాధ్యాయ నియామకాల్లో (DSC) 20 శాతం వెయిటేజీ ఉంటుంది.