తెలంగాణలో 2,620 మద్యం దుకాణాలకు 95,436 దరఖాస్తులు వచ్చాయి. దీనితో రూ. 2,863 కోట్ల ఆదాయం సమకూరింది. మద్యం దుకాణం దరఖాస్తుకు ప్రతి దరఖాస్తుకు రూ.3 లక్షల నాన్-రీఫండబుల్ ఫీజు వసూలు చేసిన తర్వాత ఈ ఆదాయాన్ని ఆర్జించింది ప్రభుత్వం. గురువారం గడువు ముగిసే సమయానికి 95 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజున, నాంపల్లిలోని రాష్ట్ర ప్రధాన కార్యాలయంతో సహా అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాలు, ఎక్సైజ్ పోలీసు పరిమితుల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద పెద్ద క్యూలు కనిపించాయి.

రాత్రి వరకు అధికారులు వివిధ కౌంటర్లలో దరఖాస్తులను స్వీకరిస్తూనే ఉన్నారు. 95,436 దరఖాస్తులు అందాయి, దీని వలన రూ.2863 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్రంలోని 34 ఎక్సైజ్ జిల్లాల్లో 2,620 ఏ4 మద్యం దుకాణాలకు లైసెన్స్లు మంజూరు చేయడానికి ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. చివరి తేదీని అక్టోబర్ 23 వరకు పొడిగించారు. చివరి రోజున దరఖాస్తులు భారీగా పెరిగాయి. శంషాబాద్, మేడ్చల్, సికింద్రాబాద్, నల్గొండ వంటి ప్రాంతాల్లో అత్యధిక దరఖాస్తులు చివరిరోజున నమోదయ్యాయని వర్గాలు తెలిపాయి. రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగిందని అధికారులు తెలిపారు.
అత్యదికంగా రంగారెడ్డి జిల్లాలో 29,430 దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా అదిలాబాద్ జిల్లాలో 4,013 దరఖాస్తులు వచ్చాయని తెలుస్తోంది. ఈ నెల 27వ తేదీన డ్రా ద్వారా మద్యం దుకాణాల లైసెన్స్ ఖరారు చేయనున్నారు. కిందటి ఏడాది 1.32 లక్షల దరఖాస్తులు వచ్చాయి. రూ.2641 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి తక్కువ దరఖాస్తులే వచ్చాయి. కానీ దరఖాస్తు రుసుమును పెంచడంతో ఎక్సైజ్ శాఖ రాబడి పెరిగింది. కిందటి ఏడాదితో పోల్చితే రూ.218 కోట్లు అదనంగా వచ్చాయి.
గతంలో రూ.2లక్షలు ఉన్న దరఖాస్తు రుముము ఈసారి మూడు లక్షలుగా చేశారు. రూ.3వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. దరఖాస్తు చేసుకునేలా విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. ఈ నెల 18వ తేదీన అర్ధరాత్రి వరకు 89,344 దరఖాస్తులు వచ్చాయి. అదే రోజు బీసీ బంద్ కారణంగా చాలా మంది దరఖాస్తు చేసుకోలేదు. దీంతో పలువురి అభ్యర్థన మేరకు గడువును 23వ తేదీ వరకు పొడిగించారు. చివరి రోజు వరకు 95,436 దరఖాస్తులు అందాయి.
{{/usCountry}}గతంలో రూ.2లక్షలు ఉన్న దరఖాస్తు రుముము ఈసారి మూడు లక్షలుగా చేశారు. రూ.3వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. దరఖాస్తు చేసుకునేలా విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. ఈ నెల 18వ తేదీన అర్ధరాత్రి వరకు 89,344 దరఖాస్తులు వచ్చాయి. అదే రోజు బీసీ బంద్ కారణంగా చాలా మంది దరఖాస్తు చేసుకోలేదు. దీంతో పలువురి అభ్యర్థన మేరకు గడువును 23వ తేదీ వరకు పొడిగించారు. చివరి రోజు వరకు 95,436 దరఖాస్తులు అందాయి.
{{/usCountry}}