TG Indiramma Sewing Machine Scheme : రాష్ట్రంలోని పేద, నిరుద్యోగ మహిళల ఆర్థిక పరిపుష్టి మరియు స్వయం ఉపాధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా "ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం" ను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. అర్హులైన వెనుకబడిన తరగతుల నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్, ఎండీ డాక్టర్ మల్లయ్య భట్టు కోరారు.
- ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే మహిళల వయస్సు 18 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.
- ఇక కుటుంబ వార్షిక రాబడికి సంబంధించి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలకు ప్రత్యేక పరిమితులు విధించారు.
- గ్రామీణ ప్రాంత అభ్యర్థుల కుటుంబ వార్షిక రాబడి రూ. 1.50 లక్షలకు మించకూడదు.
- పట్టణ ప్రాంత అభ్యర్థుల కుటుంబ వార్షిక రాబడి రూ. 2.00 లక్షల లోపు ఉండాలి.
- ఆదాయ ధృవీకరణ పత్రం ఒక సంవత్సరం క్రితం పొందినదై ఉండాలి.
కావాల్సిన ముఖ్యమైన పత్రాలు:
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం
- కుల ధృవీకరణ పత్రం
దరఖాస్తు విధానం - చివరి తేదీ:

అర్హత మరియు ఆసక్తి ఉన్న మహిళలు ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా TGOBMMS పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. ఆసక్తిగల అభ్యర్థులు http://tgobmms.cgg.gov.in వెబ్సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ 15 సెప్టెంబర్ 2026.
పథకానికి సంబంధించి మరింత సమాచారం లేదా సందేహాల నివృత్తి కోసం సంబంధిత జిల్లా బీసీ అభివృద్ధి అధికారి లేదా ఈడి బిసి కార్పొరేషన్ (ED BC Corporation) అధికారులను నేరుగా సంప్రదించవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.