గృహ కొనుగోలుదారులకు మరింత భరోసాగా ఉండేందుకు తెలంగాణ రెరా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ గైడెన్స్ సెల్ ను గురువారం ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించేందుకు, ఫిర్యాదులను వేగంగా స్వీకరించేందుకు వీలుగా ఈ సరికొత్త వ్యవస్థ పని చేయనుంది.

హైదరాబాద్లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI) సహకారంతో ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచనల మేరకు….. జాతీయ స్థాయి చర్చల అనంతరం ఈ గ్రీవెన్స్ సెల్ను తీసుకువచ్చారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత బలోపేతం చేయడం దీని ప్రధాన ఉద్దేశం.
కొనుగోలుదారులకు మరింత భరోసా..
సాధారణంగా ఇళ్లు లేదా ఫ్లాట్లు కొనే సమయంలో సామాన్యులకు అనేక సందేహాలు ఉంటాయి. ప్రాజెక్ట్ వెరిఫికేషన్ ఎలా చేయాలి? బిల్డర్ చెబుతున్న వివరాలు నిజమేనా? వంటి విషయాల్లో ఈ ప్రత్యేక సెల్ మార్గదర్శనం చేస్తుంది.
"రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకతను పెంచేందుకు, భాగస్వాములందరినీ సమన్వయం చేసేందుకే ఈ విభాగాన్ని ప్రారంభించాం" అని టీజీ-రెరా చైర్మన్ ఎన్. సత్యనారాయణ ఒక ప్రకటనలో వెల్లడించారు.
2016 నాటి రియల్ ఎస్టేట్ నియంత్రణ మరియు అభివృద్ధి చట్టం (RERA) పారదర్శకతను నిర్ధారిస్తున్నప్పటికీ… ప్రాజెక్టుల జాప్యం, బిల్డర్ల నుంచి కమ్యూనికేషన్ లోపం వంటి సమస్యలు బాధితులను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ కొత్త సెల్ ద్వారా ఫిర్యాదుదారులకు వారి హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించడంతో పాటు, రీఫండ్, నష్టపరిహారం మరియు గడువులోగా స్వాధీనం వంటి అంశాల్లో సహకారం అందిస్తారు.
కేవలం కొనుగోలుదారులకే కాకుండా, ప్రాజెక్ట్ ప్రమోటర్లు, భూ యజమానులు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు కూడా ఈ సెల్ సహాయకారిగా ఉంటుంది. ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, చట్టపరమైన నిబంధనలు, డిస్క్లోజర్స్ (వివరాల వెల్లడి) వంటి అంశాల్లో వీరికి స్పష్టతనిస్తుంది. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగంలో వృత్తి నైపుణ్యం పెరగడమే కాకుండా… అనవసరమైన వివాదాలు తగ్గే అవకాశం ఉంది.
{{/usCountry}}కేవలం కొనుగోలుదారులకే కాకుండా, ప్రాజెక్ట్ ప్రమోటర్లు, భూ యజమానులు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు కూడా ఈ సెల్ సహాయకారిగా ఉంటుంది. ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, చట్టపరమైన నిబంధనలు, డిస్క్లోజర్స్ (వివరాల వెల్లడి) వంటి అంశాల్లో వీరికి స్పష్టతనిస్తుంది. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగంలో వృత్తి నైపుణ్యం పెరగడమే కాకుండా… అనవసరమైన వివాదాలు తగ్గే అవకాశం ఉంది.
{{/usCountry}}ఈ గ్రీవెన్స్ సెల్ నిర్వహణ కోసం ప్రభుత్వం ఒక పటిష్టమైన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఒక టీమ్ లీడర్, డెస్క్ ఆఫీసర్లు, కమ్యూనికేషన్స్ స్పెషలిస్ట్, అసిస్టెంట్లు ఉంటారు. వీరు ప్రతి రోజూ వచ్చే ఫిర్యాదులను క్రమబద్ధీకరించి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్తారు. తెలంగాణవ్యాప్తంగా ఉన్న రియల్ ఎస్టేట్ స్టేక్ హోల్డర్లకు ఇది ఒక వంతెనలా పనిచేస్తుందని చైర్మన్ వివరించారు. ఈ సెల్ కేవలం సమస్యల పరిష్కారానికే కాకుండా….. భవిష్యత్తులో కొత్త పాలసీల రూపకల్పనకు అవసరమైన ఫీడ్బ్యాక్ను కూడా ప్రభుత్వానికి అందిస్తుంది.