TG SET 2025 : టీజీ సెట్ కు అప్లయ్ చేశారా...? దగ్గరపడిన దరఖాస్తుల గడువు
టీజీ సెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఎలాంటి ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు సమయం దగ్గరపడింది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 6వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణ సెట్(TS SET-2025) నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఎలాంటి ఫైన్ లేకుండా అప్లయ్ చేసుకునేందుకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు నవంబర్ 6 (గురువారం) లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఫైన్ తో ఎప్పటివరకంటే…?
ఇక నవంబర్ 6వ తేదీ దాటితే….. నవంబర్ 14వ తేదీ వరకు రూ.1,500 ఫైన్ తో దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 19 వరకు రూ.2వేల అపరాధ రుసుముతో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఇక రూ.3వేల అపరాధ రుసుముతో నవంబర్ 21 తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుంది. సాధారణ ఫీజు కింద అయితే… ఓసీలకు రూ.2000, బీసీ/ ఈడబ్ల్యూఎస్లకు రూ.1500, ఎస్సీ, ఎస్టీ, వీహెచ్, హెచ్ఐ, ఓహెచ్, ట్రాన్స్జెండర్లకు రూ.1000గా దరఖాస్తు రుసుం నిర్ణయించారు.
డిసెంబర్ రెండో వారంలో పరీక్షలు…
టీజీ సెట్ - 2025కు సంబంధించి నవంబర్ 26 నుంచి 28 తేదీల్లో అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. డిసెంబర్ 3వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. డిసెంబర్ 2వ వారం నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి.
- ఈ ఏడాది కూడా టీఎస్ సెట్ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది.
- అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. సెట్ పరీక్ష రాసేందుకు ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.
- టీజీ సెట్ -2025ను రెండు పేపర్లలో నిర్వహిస్తారు. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులతో నిర్వహిస్తారు.
- కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో మూడు గంటల పాటు పరీక్ష నిర్వహించనున్నారు.
- ఆబ్జెక్టివ్ తరహాలో 50 ప్రశ్నలకు పేపర్–1 ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు కేటాయిస్తారు.
- ఇందులో అభ్యర్థుల బోధన/పరిశోధన ఆప్టిట్యూడ్ను పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. అలాగే తార్కిక సామర్థ్యం, గ్రహణశక్తి, భిన్నమైన ఆలోచనల దృక్పథాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. ఈ పేపర్లో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుంచి ఆబ్జెక్టివ్ తరహాలో ప్రశ్నపత్రం ఉంటుంది.
- ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ,నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలుంటాయి.
- అర్హులను అభ్యర్థులు http://telanganaset.org/ వెబ్ సైట్లో పూర్తి వివరాలను చూడొచ్చు.














