రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సెట్ నిర్వహిస్తుంది. అయితే ఈ పరీక్షకు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. వచ్చే మే నెలలో కొత్త నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రకటించింది.

మే నెలలో సెట్ నోటిఫికేషన్ ఇవ్వగా… ఆ తర్వాత దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన రాత పరీక్షలను అక్టోబర్ నెలలో నిర్వహించనున్నట్లు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ ఏడాది కూడా టీఎస్ సెట్ ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది.
- అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.
- టీజీ సెట్ -2026ను రెండు పేపర్లలో నిర్వహిస్తారు. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులతో నిర్వహిస్తారు.
- కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో మూడు గంటల పాటు పరీక్ష ఉంటుంది.
- ఆబ్జెక్టివ్ తరహాలో 50 ప్రశ్నలకు పేపర్–1 ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు కేటాయిస్తారు. ఇందులో అభ్యర్థుల బోధన/పరిశోధన ఆప్టిట్యూడ్ను పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. అలాగే తార్కిక సామర్థ్యం, గ్రహణశక్తి, భిన్నమైన ఆలోచనల దృక్పథాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు.
- పేపర్ 2లో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుంచి ఆబ్జెక్టివ్ తరహాలో ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కుల చొప్పున 100 ప్రశ్నలను అడుగుతారు.
- టీఎస్ సెట్ నోటిఫికేషన్, సిలబస్ తో పాటు పాటు ముఖ్యమైన అప్డేట్స్ కోసం http://telanganaset.org/ వెబ్ సైట్ ను చూడొచ్చు.
{{^htLoading}} {{/htLoading}}
మరోవైపు గతేడాదిలో నిర్వహించిన తెలంగాణ సెట్ - 2025 ఫలితాలు ఇటీవలనే విడుదలయ్యాయి.. ఈ పరీక్షలో మొత్తం 2565 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. కేటగిరీల వారీగా అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను పేర్కొన్నారు.
టీజీ సెట్ రిజల్ట్స్ - ఇలా చెక్ చేసుకోండి
- టీజీ సెట్ - 2025 అభ్యర్థులు http://telanganaset.org/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలోని రిజల్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి.
- సబ్మిట్ చేస్తే మీ ఫలితం డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా స్కోర్ కార్డు కాపీని పొందొచ్చు.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}