ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. ఈనెల 28వ తేదీ నుంచి అధికారికంగా ప్రారంభమయ్యే ఈ జాతర… 31వ తేదీతో ముగుస్తుంది. అయితే ఇప్పటికే చాలా మంది భక్తులు మేడారం వెళ్తున్నారు. అయితే మేడారం వెళ్లలేని భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక సేవలను ప్రకటించింది.

భక్తుల మనోభావాలను గౌరవిస్తూ…. వారు కోరుకున్న చోటికే అమ్మవార్ల ప్రసాదాన్ని (బంగారం) చేర్చేందుకు టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సమయాభావం, రద్దీ లేదా ఇతర కారణాల వల్ల జాతరకు వెళ్లలేకపోయే భక్తులు నిరాశ చెందకుండా ఉండేందుకు దేవాదాయ శాఖ సహకారంతో ఆర్టీసీ ఈ వినూత్న సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అమ్మవార్ల బంగారం ప్రసాదాన్ని భక్తుల ఇంటి వద్దకే అందించే ప్రత్యేక లాజిస్టిక్స్ సేవలను, టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి ప్రాంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు.
కేవలం రూ. 299తోనే…
కేవలం రూ.299 చెల్లించడం ద్వారా…. మేడారం అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తులు తమ ఇంటి వద్దకే పొందవచ్చు.భక్తులు http://tgsrtclogistics.co.in వెబ్సైట్ ద్వారా లేదా సమీపంలోని టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో ప్రసాదాన్నిబుక్ చేసుకోవచ్చు. ప్రసాదం ప్యాకెట్తో పాటు అమ్మవార్ల ఫోటో, పసుపు, కుంకుమ, బంగారం (బెల్లం) కూడిన కిట్ను సురక్షితంగా డెలివరీ చేస్తారు. ఈ సేవలకు సంబంధించిన మరింత సమాచారం కోసం టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ను 040-69440069, 040-23450033 నెంబర్లను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.
{{/usCountry}}కేవలం రూ.299 చెల్లించడం ద్వారా…. మేడారం అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తులు తమ ఇంటి వద్దకే పొందవచ్చు.భక్తులు http://tgsrtclogistics.co.in వెబ్సైట్ ద్వారా లేదా సమీపంలోని టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో ప్రసాదాన్నిబుక్ చేసుకోవచ్చు. ప్రసాదం ప్యాకెట్తో పాటు అమ్మవార్ల ఫోటో, పసుపు, కుంకుమ, బంగారం (బెల్లం) కూడిన కిట్ను సురక్షితంగా డెలివరీ చేస్తారు. ఈ సేవలకు సంబంధించిన మరింత సమాచారం కోసం టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ను 040-69440069, 040-23450033 నెంబర్లను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.
{{/usCountry}}ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ మేడారం జాతర జరగనుంది. అయితే ఇప్పటికే చాలా మంది మేడారానికి వెళ్తున్నారు. రాబోయే రోజుల్లో భక్తుల మరింత పెరగనుంది. ఏపీ, తెలంగాణ మాత్రమే కాకుండా ఒడిశా, ఛత్తీస్ ఘడ్ తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం 3,495 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని….. ఈసారి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది.భక్తుల రద్దీ అంచనాలకు మించి మరీ ఎక్కువగా ఉంటే… మరిన్ని బస్సులు నడిపే విధంగా ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది.
ఇక ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీకి 50 శాతం అదనపు మొత్తాన్ని జోడించి వసూలు చేస్తారు. ప్రత్యేక పండుగలు, జాతరలు, ఇతర ఉత్సవాల సమయంలో నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకు చార్జీలు పెంచుకునేందుకు ఆర్టీసీకి అనుమతి ఉంది. ఇదే నిర్ణయం మేడారం ప్రత్యేక బస్సులకు వర్తించనుంది.
మరోవైపు మేడారంలో కూడా తాత్కాలిక బస్ స్టాండులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. క్యూలైన్లు, టిక్కెట్ల కౌంటర్, పార్కింగ్ స్థలాలు, క్యాంటీన్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకవస్తోంది. కమాండ్ కంట్రోల్ రూం, తాత్కాలిక మరుగుదొడ్లు, తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. బస్టాండ్ పనులు ఇప్పటికే కొనసాగుతుండగా…. ఈనెల 23న ప్రారంభించనున్నారు.