తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 'హైదరాబాద్ కనెక్ట్' ప్రణాళిక కింద 373 కొత్త కాలనీలకు తన సేవలను విస్తరించింది. దీని వలన 7.6 లక్షల మంది నగరవాసులకు ప్రయోజనం చేకూరుతోంది. ఈ సేవలు డిసెంబర్ నుంచే అందుబాటులోకి వస్తాయి. ప్రధానంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఉప్పల్ ప్రాంతాలలోని సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటాయి.
కొత్తగా హైదరాబాద్ కనెక్ట్లో భాగంగా 373 కాలనీలలో బస్సులు తిరుగుతాయి. ఇందులో 243 హైదరాబాద్ ప్రాంతం నుండి, 130 సికింద్రాబాద్ ప్రాంతం నుండి ఎంపిక చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్ డిపోల వారీగా సర్వీసులు ఏ ప్రాంతం నుంచి ఎన్ని కాలనీలకు ఉంటాయో చూద్దాం..
హైదరాబాద్
దిల్ సుఖ్ నగర్: 55 కాలనీలు
రాజేంద్రనగర్: 51 కాలనీలు
మిధాని: 42 కాలనీలు
బండ్లగూడ: 34 కాలనీలు
మెహదీపట్నం: 17 కాలనీలు
ఇబ్రహీంపట్నం: 14 కాలనీలు
హయత్నగర్-1: 12 కాలనీలు
హయత్నగర్-2: 10 కాలనీలు
ఫలక్నుమా: 7 కాలనీలు
మహేశ్వరం: 1 కాలనీ
సికింద్రాబాద్
జీడిమెట్ల: 36 కాలనీలు
చెంగిచెర్ల: 25 కాలనీలు
కూకట్పల్లి: 21 కాలనీలు
మేడ్చల్: 10 కాలనీలు
ఉప్పల్: 10 కాలనీలు
హెచ్సీయూ: 8 కాలనీలు
మియాపూర్-2: 7 కాలనీలు
కంటోన్మెంట్: 6 కాలనీలు
రాణిగంజ్: 4 కాలనీలు
కుషాయిగూడ: 3 కాలనీలు
ఈ సందర్భంగా రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 'గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్తగా ఏర్పడిన కాలనీల నివాసితులు ఎటువంటి రవాణా సమస్యలను ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో మేం 'హైదరాబాద్ కనెక్ట్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం.' అని చెప్పారు.
హైదరాబాద్ కనెక్ట్ కార్యక్రమం మూడు దశల్లో అమలు చేస్తారు. మొదటి దశ సేవలు అత్యంత రద్దీగా ఉండే కాలనీలలో అందుబాటులో ఉంటాయి. ప్రైవేట్ వాహనాల వాడకాన్ని తగ్గించడం, ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యాన్ని నివారించడం అనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పొన్నం ప్రభాకర్ అన్నారు.
{{/usCountry}}హైదరాబాద్ కనెక్ట్ కార్యక్రమం మూడు దశల్లో అమలు చేస్తారు. మొదటి దశ సేవలు అత్యంత రద్దీగా ఉండే కాలనీలలో అందుబాటులో ఉంటాయి. ప్రైవేట్ వాహనాల వాడకాన్ని తగ్గించడం, ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యాన్ని నివారించడం అనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పొన్నం ప్రభాకర్ అన్నారు.
{{/usCountry}}ప్రజల అభ్యర్థనలు, అవసరాల ఆధారంగా కొత్త కాలనీలను ఎంచుకోవడానికి క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహించామని మంత్రి పొన్నం అన్నారు. ఈ కాలనీల నుండి ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఉద్యోగ కేంద్రాలకు కనెక్టివిటీ పెరగడం వల్ల ప్రయాణ సమయం, ఖర్చులు ఆదా అవుతాయని, అలాగే ప్రజలు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడటం తగ్గుతుందని చెప్పారు. జనాలు ఈ బస్సుల గురించి TGSRTC Gamyam యాప్లో తనిఖీ చేయవచ్చు.