హైదరాబాద్ లోని జంట నగర వాసులకు ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. ఈ- మెట్రో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో టికెట్ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఇవాళ్టి(మార్చి 1) నుంచే అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

ప్రస్తుతం వేసవి కాలం కావటంతో ఎండలు ముదురుతున్నాయి. ఓవైపు ఉక్కపోత కూడా మొదలైంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. అయితే ఉక్కబోత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీ బస్సుల్లో ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్లో తిరిగే ఏసీ బస్సుల్లో టికెట్ల రేట్లను తగ్గిస్తూ నిర్ణయం ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.
- నగరంలో తిరిగే మెట్రో డీలక్స్ ఏసీ బస్సుల్లో కిలోమీటర్లకు గాను టికెట్ ఛార్జీ రూ.30గా ఉండేది. కానీ ఇప్పుడు దానిని రూ.25కి తగ్గించారు.
- ఈ-మెట్రో ఏసీ బస్సుల్లో నాలుగు కిలోమీటర్లకు గాను రూ.35 చొప్పున టికెట్ ధర ఉండేది. తాజా నిర్ణయంతో రూ.25కి తగ్గింది.
- ఈ మెట్రో ఏసీ బస్సుల్లో ఏకంగా రూ.10 మేర తగ్గింది.
- గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 275 మెట్రో డీలక్స్, 90 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు సేవలు అందిస్తున్నాయి.
- తెలంగాణ ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో చాలా మంది ప్రయాణికులు ఈ బసుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉంది.
{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}