నూతన సంవత్సరం సందర్భంగా నగరంలోని కమిషనరేట్ల పరిధిలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భారీగా వాహనాలను పట్టుకున్నారు. మొత్తం 2,731 మందిపై కేసులు నమోదు చేశారు. గతేడాదితో పోల్చితే ఈసారి 5 శాతం కేసుల సంఖ్య తగ్గినట్లు పోలీసులు తెలిపారు. గత సంవత్సరం న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా 2,873 కేసులు నమోదయ్యాయి.
కమిషనర్లేట్ల వారీగా కేసులు…

ఈసార నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను కమిషనరేట్ల వారీగా చూస్తే…. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,198 మంది, సైబరాబాద్లో 928 మంది, మాల్కాజ్ గిరి కమిషరేట్ పరిధిలో 605 మంది డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డారు. ఈ వివరాల ప్రకారం… హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ లో నూతన సంవత్సర వేడుకలు పెద్ద సంఘటనలు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా గడిచిపోయాయని సంబంధిత పోలీస్ అధికారులు ప్రకటించారు. ఈ కమిషనరేట్ అంతటా 36 ప్రత్యేక బృందాలను మోహరించారు. డ్రైవ్ సమయంలో మొత్తం 605 మంది మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డగా… వీరిపై కేసులు నమోదయ్యాయి.
ఛార్జిషీట్లు దాఖలు చేసిన తర్వాత నిందితులందరినీ కోర్టులో హాజరుపరుస్తామని పోలీసు అధికారులు తెలిపారు. దీనితో పాటు వారి డ్రైవింగ్ లైసెన్సులను స్వాధీనం చేసుకుని మోటారు వాహనాల చట్టం, 1988 లోని సెక్షన్ 19 ప్రకారం సస్పెండ్ చేయడానికి సంబంధిత ప్రాంతీయ రవాణా అధికారులకు (ఆర్టీఏ) పంపబడుతుందని పోలీసుల అధికారులు వివరించారు. ఎల్బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్, కుశాయిగూడ తదితర ప్రాంతాల్లో డ్రంక్ డ్రైవ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
విస్తృతమైన ట్రాఫిక్ నిర్వహణ మరియు రహదారి భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయడం వల్ల నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో ఎక్కడా పెద్ద రోడ్డు ప్రమాదాలు జరగలేదని అధికారులు గుర్తించారు.
{{/usCountry}}విస్తృతమైన ట్రాఫిక్ నిర్వహణ మరియు రహదారి భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయడం వల్ల నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో ఎక్కడా పెద్ద రోడ్డు ప్రమాదాలు జరగలేదని అధికారులు గుర్తించారు.
{{/usCountry}}రోడ్లపై భద్రతను కాపాడటానికి దోహదపడిన పౌరుల సహకారం మరియు బాధ్యతాయుతమైన ప్రవర్తనకు మల్కాజిగిరి పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.