హైదరాబాద్ నగర నడిబొడ్డున కేబీఆర్ జాతీయ పార్కు పర్యావరణ పరిరక్షణ పోరాటంలో మరో కీలక మలుపు తిరిగింది. ప్రతిపాదించిన ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం కేబీఆర్ పార్క్ వద్ద చెట్లను కొట్టేయడంపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. తదుపరి విచారణ జరిగే వరకు అక్కడ ఒక్క చెట్టును కూడా కొట్టేయకూడదంటూ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

పార్కు పరిధిలోని ‘పర్యావరణ సున్నిత ప్రాంతం’ (Eco-Sensitive Zone)లో 25 నుంచి 30 మీటర్ల పరిధిలో ఉన్న చెట్లను నరకడానికి వీల్లేదని కోర్టు పేర్కొంది. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా 1,300 చెట్లను నరికేస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వివేక్రెడ్డి న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
'రాత్రి, పగలు తేడా లేకుండా చెట్లను తొలగిస్తున్నారు. కనీసం ప్రత్యామ్నాయ ప్రణాళిక కూడా లేకుండా పర్యావరణానికి తీవ్ర నష్టం చేకూరుస్తున్నారు.' అని వివేక్ రెడ్డి వాదించారు.
ఈ ఫ్లైఓవర్లో భాగంగా చెట్లను నరికేయకుండా ప్రణాళిక ఏమైనా ఉందా అని కోర్టు ప్రశ్నించింది. అలాంటిదేమీ లేదని న్యాయవాది వివేక్ రెడ్డి కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు... కేంద్ర పర్యావరణ శాఖకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను జులై 27కి వాయిదా వేసింది.
జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడానికి అప్పట్లో ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని ప్రతిపాదించారు. అయితే ఈ ప్రాజెక్టు వల్ల వందలాది ఏళ్ల నాటి చెట్లు అంతరించిపోతాయని, నగర పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని అటు పర్యావరణ ప్రేమికులు, ఇటు స్థానిక ప్రజలు మొదటి నుంచి సేవ్ కేబీఆర్ పార్క్ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు.
ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం కోసం అభివృద్ధి పేరిట ఫ్లైఓవర్లు నిర్మించాలా? లేక నగరానికి ఆక్సిజన్ అందించే పర్యావరణాన్ని కాపాడుకోవాలా? అనే చర్చ ఇప్పుడు మళ్లీ సర్వత్రా వ్యక్తమవుతోంది. చెట్లను వేళ్లతో సహా వేరే ప్రాంతానికి తరలించే సాంకేతికత అందుబాటులో ఉన్నా, అది ఎంతవరకు సఫలమవుతుందనేది ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఇచ్చిన స్టే .. ప్రకృతి ప్రేమికులకు పెద్ద ఊరటనిచ్చిందనే చెప్పాలి. మరి జులై 27న కోర్టు ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
{{/usCountry}}ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం కోసం అభివృద్ధి పేరిట ఫ్లైఓవర్లు నిర్మించాలా? లేక నగరానికి ఆక్సిజన్ అందించే పర్యావరణాన్ని కాపాడుకోవాలా? అనే చర్చ ఇప్పుడు మళ్లీ సర్వత్రా వ్యక్తమవుతోంది. చెట్లను వేళ్లతో సహా వేరే ప్రాంతానికి తరలించే సాంకేతికత అందుబాటులో ఉన్నా, అది ఎంతవరకు సఫలమవుతుందనేది ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఇచ్చిన స్టే .. ప్రకృతి ప్రేమికులకు పెద్ద ఊరటనిచ్చిందనే చెప్పాలి. మరి జులై 27న కోర్టు ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
{{/usCountry}}