TS DOST 2026 : 'దోస్త్‌‌'కు అప్లై చేయడానికి ఈరోజే చివరి తేదీ.. డైరెక్ట్ లింగ్ ఇదిగో

TS DOST 2026 : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం వేచి చూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్. దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగుస్తోంది.

Published on: May 7, 2026, 12:09:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ ఉన్నత విద్యా మండలి(TGCHE), TS DOST 2026 రిజిస్ట్రేషన్ ప్రక్రియను 2026 మే 7తో ముగుస్తోంది. తెలంగాణ రాష్ట్ర డిగ్రీ ఆన్‌లైన్ సేవల ద్వారా యూజీ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు.. TS DOST అధికారిక వెబ్‌సైట్ dost.cgg.gov.inలో డైరెక్ట్ లింక్‌ను పొందవచ్చు.

దోస్త్ అప్లికేషన్
దోస్త్ అప్లికేషన్

వెబ్ ఆప్షన్లు మే 8, 2026న ముగుస్తాయి. ఫేజ్ 1 సీట్ల కేటాయింపు ఫలితం మే 14, 2026న ప్రకటిస్తారు. సీట్లు కేటాయించిన అభ్యర్థులు మే 15 నుండి 23, 2026 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్‌ను పూర్తి చేయవచ్చు. రెండో దశ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 15న ప్రారంభమై మే 25, 2026న ముగుస్తుంది.

TS DOST 2026: ఎలా దరఖాస్తు చేయాలి

1. TS DOST అధికారిక వెబ్‌సైట్ dost.cgg.gov.in ను సందర్శించండి.

2. హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న TS DOST 2026 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.

3. ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది, అక్కడ అభ్యర్థులు తమను తాము నమోదు చేసుకోవాలి.

4. నమోదు పూర్తయిన తర్వాత, దరఖాస్తు పత్రాన్ని పూరించండి.

5. దరఖాస్తు రుసుము చెల్లించండి.

6. సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి.

7. తదుపరి అవసరం కోసం హార్డ్ కాపీని భద్రపరచుకోండి.

రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో(ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన, వీరనారి చాకలి ఇలమ్మ మహిళా విశ్వవిద్యాలయం, డా.మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ, జేఎన్‌టీయూ, టీఎస్-ఎస్‌బీటీఈటీ) ఏదైనా డిగ్రీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం DOST ఆన్‌లైన్ విండోను అందిస్తుంది.

ఇంటర్మీడియట్ పూర్తి చేసి.. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు తమకు ఇష్టమైన కాలేజీలు, సబ్జెక్టులను ప్రాధాన్య క్రమంలో ఎంచుకునేందుకు అవకాశం ఉంటుంది. https://dost.cgg.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.

దోస్త్ ప్రక్రియలో వెబ్ ఆప్షన్ల ఎంపిక అత్యంత కీలకమైన ఘట్టం. విద్యార్థులు ఇచ్చే ప్రాధాన్యత క్రమం ఆధారంగానే సీట్ల కేటాయింపు జరుగుతుంది. అభ్యర్థులు ఎన్ని ఆప్షన్లనైనా ఇచ్చుకోవచ్చు. ఒక్కసారి ఆప్షన్లు ఇచ్చాక… గడువు ముగిసే వరకు వాటిని ఎన్నిసార్లైనా మార్చుకునే (Edit) సదుపాయం ఉంటుంది.

ఈ లింక్ క్లిక్ చేసి అప్లై చేయండి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More