సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆర్మోరీ నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి మాయమైన సంచలన ఘటనను దర్యాప్తు అధికారులు ఎట్టకేలకు ఛేదించినట్టుగా తెలుస్తోంది. ఘటన జరిగిన 11 రోజుల వ్యవధిలోనే మిలటరీ ఇంటెలిజెన్స్, తెలంగాణ పోలీస్ టాస్క్ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

కస్టడీలోకి తీసుకున్న నలుగురిలో ఒకరు నాగర్కర్నూల్ జిల్లాకు చెందినవారు కాగా మిగిలిన ముగ్గురు ఇతర ప్రాంతాలకు చెందినవారు. ఆయుధాలను దొంగిలించడం, అక్కడ నుంచి తరలించడం, దాచిపెట్టడంలో వీరి పాత్రలపై పోలీసులు, మిలటరీ అధికారులు తీవ్రంగా విచారిస్తున్నారు.
ఈ సంచలన చోరీ వెనక ఓ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు విచారణలో ఆధారాలు లభించాయి. తన పూర్వపు కమాండింగ్ ఆఫీసర్పై ఉన్న తీవ్రమైన వ్యక్తిగత కక్షే ఈ దొంగతనానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆయనను చిక్కుల్లో పడేయాలనే దురుద్దేశంతోనే ఈ చోరీకి ప్లాన్ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
విచారణలో వెల్లడైన సమాచారం ఆధారంగా నాగర్కర్నూల్ జిల్లాలోని ఒక ప్రాంతంలో దాచిపెట్టిన ఆయుధాల నిల్వను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన తుపాకులు, మందుగుండు సామగ్రిని ఆర్మోరీ ఇన్వెంటరీ జాబితాతో సరిచూస్తున్నారు. మాయమైన ఆయుధాలన్నీ లభ్యమయ్యాయా లేదా అనేది పూర్తి తనిఖీల అనంతరం అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతానికి నిందితుల అరెస్టును అధికారికంగా నమోదు చేయాల్సి ఉంది.
ఆగస్టు 31న ఉదయం 7:50 గంటల ప్రాంతంలో ఆర్మోరీ తలుపులు తెరిచి ఉండటం, ఆయుధాలు భద్రపరిచే పెట్టెల తాళాలు పగలేసి ఉండటాన్ని సిబ్బంది గమనించడంతో ఈ దొంగతనం బయటపడింది. అంతకుముందు రోజు (ఆగస్టు 30) సాయంత్రం 6 గంటలకు ఆయుధాలను లెక్కించారు. ఆ తర్వాతే చోరీ జరిగింది. నాలుగు ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు, ఒక ఇన్సాస్ (INSAS) రైఫిల్, ఏడు పిస్టళ్లతో పాటు భారీగా మందుగుండు సామగ్రి మాయమైనట్లు గుర్తించారు.
ఈ ఘటనపై బొల్లారం పోలీసులు కేసులు నమోదు చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే మిలటరీ ఆర్మోరీలోకి ఇతరులు ప్రవేశించడం అసాధ్యం. అంతేకాకుండా దాదాపు 40 కిలోల బరువుండే ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఎవరి కంటా పడకుండా బయటకు తరలించడం అంత సులభం కాదు. దీంతో మొదటి నుంచీ ఇది లోపలి వ్యక్తుల సాయంతో జరిగిన ఇన్సైడర్ ఆపరేషన్ అయి ఉంటుందని అధికారులు భావించారు.
{{/usCountry}}ఈ ఘటనపై బొల్లారం పోలీసులు కేసులు నమోదు చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే మిలటరీ ఆర్మోరీలోకి ఇతరులు ప్రవేశించడం అసాధ్యం. అంతేకాకుండా దాదాపు 40 కిలోల బరువుండే ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఎవరి కంటా పడకుండా బయటకు తరలించడం అంత సులభం కాదు. దీంతో మొదటి నుంచీ ఇది లోపలి వ్యక్తుల సాయంతో జరిగిన ఇన్సైడర్ ఆపరేషన్ అయి ఉంటుందని అధికారులు భావించారు.
{{/usCountry}}ఘటన జరిగిన సమయంలో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్తో సహా ప్రధాన సైనిక దళం రాజస్థాన్లో ఫీల్డ్ ఫైరింగ్ ప్రాక్టీస్ కోసం వెళ్లింది. ఈ సమయాన్ని ఆసరాగా చేసుకుని దొంగతనానికి పాల్పడ్డినట్టుగా తెలుస్తోంది. విచారణలో భాగంగా ఆర్మోరీ సంరక్షణ బాధ్యతలు చూసే అధికారులు, కాపలాదారులు, అగ్నివీర్లను దర్యాప్తు బృందాలు విచారించాయి. అలాగే ఆర్మోరీ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలు రాత్రి సమయంలో బంద్ చేసి ఉండటం, దొంగతనాల నిరోధక అలారాలు (Anti-burglary alarms) పనిచేయకపోవడం దర్యాప్తులో గుర్తించారు.