మంత్రివర్గం నుంచి తొలగించడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ స్పందించారు. పదవి పోయినందుకు తనకు ఎలాంటి బాధ లేదని, కానీ ఎటువంటి కారణం లేకుండా తొలగించడం మాత్రం మనస్తాపానికి గురిచేసిందని పేర్కొన్నారు. బర్తరఫ్ వేటు పడిన అనంతరం వరంగల్లో తొలిసారిగా తన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలతో కొండా దంపతులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయాల్లో అవకాశవాదం ఎక్కువైపోయిందని విమర్శించారు. పదవుల కంటే ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఎంపీపీ స్థాయి నుంచి మంత్రి పదవి వరకు ఎదిగానని, గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి కోసం ఎలాంటి ఆలోచన లేకుండా పదవికి రాజీనామా చేశానని గుర్తుచేశారు.
ఉదయం ఒక పార్టీలో ఉండి మధ్యాహ్నానికి మరో పార్టీ కండువా కప్పుకునే సంస్కృతి తమది కాదని, కొందరు వార్డు మెంబర్ పదవికి కూడా రాజీనామా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్లో కొందరు కుట్రలు చేసి తమకు టికెట్ రాకుండా అడ్డుకున్నప్పుడు కేసీఆర్ పిలిచి వరంగల్ ఈస్ట్ టికెట్ ఇచ్చారని, అక్కడ పోటీ చేసి నాటి అధికార పార్టీ మంత్రిని ఓడించామని సురేఖ చెప్పారు.
'పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. పదవి లేకపోయినా ప్రజల మధ్యే ఉంటూ సేవ చేస్తాం. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధిస్తాం. ఇక బర్తరఫ్ వార్త తెలిసిన తర్వాత కొందరు కార్యకర్తలు ఆందోళనలు చేద్దామని ఫోన్ చేశారు. కానీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని అందరికీ నచ్చజెప్పాం. అలాగే రేవంత్ రెడ్డి రైతు పాదయాత్ర సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఆయనలాంటి మాస్ లీడర్ అవసరమని చెప్పిన మొదటి వ్యక్తిని నేనే.' అని సురేఖ అన్నారు.
సారీ చెప్పే ప్రసక్తే లేదు: కొండా మురళి
ఈ సమావేశంలో కొండా మురళి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ ఆశయమని తెలిపారు. 'మంత్రి పదవి దక్కించుకోవడం కంటే ఆత్మగౌరవంతో బతకడమే ముఖ్యం. సురేఖను క్షమాపణలు చెప్పాలని కొందరు కోరారు. కానీ పదవి ఊడినా పర్లేదు గానీ సారీ చెప్పేది లేదని నా భార్య తేల్చి చెప్పింది. మా రక్తంలోనే కృతజ్ఞత ఉంది, మాట కోసం నిలబడే తత్వం మాది.' అని కొండా మురళి స్పందించారు.
{{/usCountry}}ఈ సమావేశంలో కొండా మురళి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ ఆశయమని తెలిపారు. 'మంత్రి పదవి దక్కించుకోవడం కంటే ఆత్మగౌరవంతో బతకడమే ముఖ్యం. సురేఖను క్షమాపణలు చెప్పాలని కొందరు కోరారు. కానీ పదవి ఊడినా పర్లేదు గానీ సారీ చెప్పేది లేదని నా భార్య తేల్చి చెప్పింది. మా రక్తంలోనే కృతజ్ఞత ఉంది, మాట కోసం నిలబడే తత్వం మాది.' అని కొండా మురళి స్పందించారు.
{{/usCountry}}