జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కారు పార్టీ తేలిపోయింది. అధికార కాంగ్రెస్ పార్టీ చేతిలో భారీ మెజార్టీ తేడాతోనే ఓడిపోయింది. ఈ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకెళ్లినప్పటికీ…. ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు. ప్రతి రౌండ్ లోనూ హస్తం పార్టీ హవానే కనిపించగా…. బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
బీఆర్ఎస్ ఓటమి - కొన్ని కారణాలు
- మాగంటి గోపినాథ్ మృతితో ఆయన భార్యకే టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ప్రధానంగా సెంటిమెంట్ అస్త్రం కలిసివస్తుందని భావించినప్పటికీ... ఆ పరిస్థితి కనిపించలేదు. పైగా మాగంటి గోపినాథ్ కుటుంబంలోని వివాదాలు కూడా అభ్యర్థి సునీతకు ఇబ్బందిగా మారిన పరిస్థితి కనిపించింది.
- కాంగ్రెస్ బాకీ కార్డు, హైడ్రా బుల్డోజర్లు, పెన్షన్ల వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలను బీఆర్ఎస్ గట్టిగా చేసింది. కానీ ఆశించిన మేరకు ఓటర్లను తమవైపు తిప్పుకోలేకపోయింది.
- పార్టీ అధినేత కేసీఆర్ ప్రచారంలో పాల్గొనలేదు. అన్నీ వ్యవహారాలు కేటీఆర్ మాత్రమే చూసారు. కేసీఆర్ ప్రచారంలో పాల్గొనకపోవటం కూడా బీఆర్ఎస్ కు మైనస్ అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
- ఉపఎన్నిక ప్రచారంలో ముందంజలో ఉన్న బీఆర్ఎస్.... పోల్ మేనేజ్మెంట్ విషయంలో వెనకబడిపోయిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా చివరి 2 రోజుల్లో వెనకపడిపోయినట్లు కనిపించింది. ప్రచారంలో రాష్ట్రస్థాయి నేతలు కీలకంగా ఉన్నప్పటికీ... పోలింగ్ జరిగే నాటికి ఆయా డివిజన్లలో నాయకత్వలేమి సమస్య ఇబ్బందికరంగా మారింది.
- ఎంఐఎం పార్టీ నవీన్ యాదవ్ కు మద్దతు ప్రకటించటం కూడా బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారింది. మైనార్టీల ఓట్లు ఆశించిన స్థాయిలో రాకుండా కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యాయి.
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ అజహరుద్దీన్ కు కాంగ్రెస్ పార్టీ మంత్రిగా అవకాశం కల్పించింది. ఈ నిర్ణయం కాంగ్రెస్ కు కలిసివచ్చింది. ఈ పరిణామం ఎంతో కొంత ఉపఎన్నికపై ప్రభావం చూపినట్లు అయింది.

{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}