మద్యంతోపాటుగా ఎక్కువ ఫుడ్ తీసుకోవడమే ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల మృతికి కారణం!

మద్యంతాగి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మృతి చెందిన ఘటన ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో విషయాన్ని పోలీసులు వెల్లడించారు.

Published on: Jan 21, 2026 3:33 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అన్నమయ్య జిల్లాలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అధికంగా మద్యం సేవించి మృతిచెందారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే మద్యంతోపాటుగా మరో కారణం కూడా వారు మృతిచెందడానికి కారణమైంది. అధికంగా మద్యం సేవించడం, అతిగా ఆహారం తినడం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మృతి చెందడానికి కారణం అని పోలీసు అధికారి తెలిపారు.

మద్యం తాగి ఇద్దరు మృతి
మద్యం తాగి ఇద్దరు మృతి

మరణించిన మణి కుమార్ (35), పుష్పరాజ్ (27) జనవరి 17న అదే గ్రామానికి చెందిన తమ నలుగురు స్నేహితులను కలుసుకుని చాలా గంటలపాటు కలిసి బీర్లు తాగారు. 'అన్నమయ్య జిల్లాకు చెందిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు స్నేహితులతో కలిసి మద్యం సేవించిన తర్వాత ఆహారం ఎక్కువగా తినడం కారణంగా మరణించారు.' అని రాయచోటి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పీ) కృష్ణ మోహన్ పీటీఐకి తెలిపారు.

నలుగురు స్నేహితులు 19 బీర్ సీసాలను కొనుగోలు చేసి మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 7.30 గంటల మధ్య వాటిని తాగారు. ఈ సమయంలో వారు ఫుడ్ కూడా అధికంగా తీసుకున్నారు. మణికుమార్ ఆరు బీర్ సీసాలు తాగగా, పుష్పరాజ్ ఐదు సీసాలు తాగాడని పోలీసులు తెలిపారు.

ఇంటికి తిరిగి వస్తుండగా కుమార్ కుప్పకూలిపోయాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపాడు. ఆ తర్వాత స్నేహితులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ కుమార్ మొదట మరణించగా, పుష్పరాజ్ రాత్రి 10 గంటల ప్రాంతంలో మరణించాడని కృష్ణ మోహన్ చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమార్ బీరు తాగడం కంటే ముందే మద్యం సేవించి ఉన్నాడు. ప్రాథమిక దర్యాప్తులో అధికంగా మద్యం సేవించడం, ఆహారం ఎక్కువ తీసుకోవడం వలన శ్వాసకోశ సమస్య తలెత్తిందని తేలింది.

జనవరి 18న, కుమార్ తండ్రి నరసింహ మరణానికి కారణం తెలియదని పేర్కొంటూ ఫిర్యాదు చేశారు. పోలీసులు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 194 కింద కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపామని, ఉపయోగించిన బీర్ సీసాల నమూనాలను ప్రయోగశాల పరీక్ష కోసం పంపామని చెప్పారు. ఇందులో ఎటువంటి మలినాలు లేవని తేలిందని డీఎస్పీ తెలిపారు. మృతుడి రక్తం, ఇతర నమూనాలను మరింత విశ్లేషణ కోసం ప్రయోగశాలకు పంపినట్లు వెల్లడించారు.

సంక్రాంతి పండుగ సమయంలో ఇద్దరు వ్యక్తులు మరణించడం స్థానికంగా కలకలం రేపింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు బీర్లు తాగడంతో డీహైడ్రేషన్‌కు కూడా గురయ్యారు. అధికంగా ఆహారం తీసుకోవడంతో శ్వాస సమస్య తలెత్తిందని పోలీసులు చెబుతున్నారు. మణికుమార్‌కు భార్య, రెండేల్ల కుమారుడు ఉన్నారు. పుష్పరాజ్‌కు ఇంకా పెళ్లి కాలేదు.