తెలుగు రాష్ట్రాల నుంచి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లేవారికి శుభవార్త. తక్కువ ఖర్చుతో వెళ్లిరావొచ్చు. భారతీయ రైల్వే హైదరాబాద్లోని చర్లపల్లి నుండి అస్సాం రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్య మధ్య కొత్త అమృత భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రకటించింది. ఈ అమృత్ భారత్ రైలు మార్చి 13, 2026 నుండి ప్రారంభం అవుతుంది. ఇది దక్షిణాది రాష్ట్రాలు, దేశంలోని ఈశాన్య ప్రాంతం మధ్య మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది.

రైల్వే అధికారుల ప్రకారం.. కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు మార్చి 13న కామాఖ్య నుండి జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ సేవలో స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి. ఇవి సుదూర ప్రయాణికులకు సరసమైన, సౌకర్యవంతమైన ప్రయాణ ఆప్షన్ అందిస్తాయి.
ఈ కొత్త రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లను అస్సాంతో కలుపుతుంది. ఈశాన్యంలోని సెవెన్ సిస్టర్స్ రాష్ట్రాలకు ప్రవేశ ద్వారంగా అస్సాంని చెబుతారు. అమృత్ భారత్ రైలు ఈశాన్య ప్రాంతానికి ప్రయాణించే, తిరిగి వచ్చే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. అంతేకాగు తక్కువ ధరలో వెళ్లి రావొచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో స్టాప్లు
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మీదుగా ప్రయాణించే సమయంలో రైలు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది. ఏయే స్టాప్స్ ఉన్నాయో ఇక్కడ చూడండి. కామాఖ్య నుంచి వచ్చే సమయంలో ఈ కింది స్టేషన్లలో ఆగుతుంది.
- ఆంధ్రప్రదేశ్ : శ్రీకాకుళం రోడ్, విజయనగరం జంక్షన్, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరు,
- తెలంగాణ : నల్గొండ, చర్లపల్లి
చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ రైలు వెళ్లే సమయంలో కూడా పైన చెప్పిన స్టేషన్లలో ఆగుతుంది. రైలు కనెక్టివిటీని బలోపేతం చేయడం, దేశంలోని దక్షిణ, ఈశాన్య ప్రాంతాల మధ్య ప్రయాణికులకు సులభతరమైన ప్రయాణాన్ని అందించడం కోసం ఈ కొత్త సేవను భారతీయ రైల్వే ప్రవేశపెట్టింది.
నాగర్కోయిల్ - చర్లపల్లి
{{/usCountry}}చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ రైలు వెళ్లే సమయంలో కూడా పైన చెప్పిన స్టేషన్లలో ఆగుతుంది. రైలు కనెక్టివిటీని బలోపేతం చేయడం, దేశంలోని దక్షిణ, ఈశాన్య ప్రాంతాల మధ్య ప్రయాణికులకు సులభతరమైన ప్రయాణాన్ని అందించడం కోసం ఈ కొత్త సేవను భారతీయ రైల్వే ప్రవేశపెట్టింది.
నాగర్కోయిల్ - చర్లపల్లి
{{/usCountry}}హైదరాబాద్ నగరంలోని చర్లపల్లి, తమిళనాడులోని నాగర్కోయిల్ మధ్య కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను కూడా రైల్వే శాఖ ప్రకటించింది. నాగర్కోయిల్ - చర్లపల్లి కొత్త సర్వీసు మార్చి 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని రైల్వే వర్గాలు తెలిపాయి.
దక్షిణాది రాష్ట్రాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు సౌకర్యార్థం కోసం భారతీయ రైల్వే.. కొత్తగా నాగర్కోయిల్-చర్లపల్లి-నాగర్కోయిల్ మధ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు సేవలను ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను అనుసంధానిస్తూ ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు సేవలు అందించనున్నది.
చర్లపల్లి(హైదరాబాద్) నుంచి బయలుదేరే ఈ ట్రైన్.. నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట్, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, పాలక్కాడ్, ఎర్నాకులం, కొట్టాయం, కొల్లాం మీదుగా నాగర్ కోయిల్(తమిళనాడు)కు చేరుకుంటుంది.
సాధారణ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ రైళ్లలో స్లీపర్ క్లాస్ బోగీలు, జనరల్ బోగీలు, ఛార్జింగ్ పాయింట్లు, బయోటాయిలెట్లు, సీసీటీవీ కెమెరాలు వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.