ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 5 పట్టణ ప్రాంతాల్లో కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఘన వ్యర్థాల ఆధారిత బయో-ఎనర్జీ మౌలిక సదుపాయాలను కార్యరూపంలోకి తీసుకురానుంది. ఈ ప్లాంట్ల ఏర్పాటు కోసం శనివారం ప్రభుత్వం రూ. 60 కోట్లను మంజూరు చేసింది.
5 ప్రాంతాల్లో బయోగ్యాస్ ప్లాంట్లు….

రాజమహేంద్రవరం, నెల్లూరు, గుంటూరు మరియు ఒంగోలులలో కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేయబడతాయి. వీటితో పాటు విజయవాడలో ఉన్న పాత ప్లాంట్ను పునరుద్ధరించి…. ఆధునీకరిస్తారు.
ప్రతి ప్లాంట్ రోజుకు 25 టన్నుల (TPD) వ్యర్థాలను ప్రాసెస్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మొత్తం ఐదు నగరాల్లో కలిపి రోజుకు 125 టన్నుల వ్యర్థాలను వినియోగిస్తారు.
హైదరాబాద్లోని కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (CSIR-IICT) ఈ ప్రాజెక్టుకు సాంకేతిక సలహాదారుగా వ్యవహరించనుంది.
బయోగ్యాస్ తో ప్రయోజనాలు:
ఈ బయో గ్యాస్ ప్లాంట్స్ ఏర్పాటు వల్ల అనేక ప్రయోజనాలుంచాయి. నగరాల్లో పేరుకుపోతున్న ఘన వ్యర్థాల సమస్య తగ్గుతుంది. ఘన వ్యర్థాల నుంచి తయారయ్యే బయోగ్యాస్ను ఇంధనంగా వాడుకోవచ్చు. గ్యాస్ ఉత్పత్తి తర్వాత మిగిలే వ్యర్థాలను సేంద్రియ ఎరువులుగా ఉపయోగించవచ్చు. వీటి పంట పొలాల్లో వినియోగిస్తారు.
- పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలతో పోలిస్తే బయో గ్యాస్ తక్కువ కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తుంది. ఇది పర్యావరణాన్ని దెబ్బతియదు.
- పెట్రోల్, డీజిల్ మరియు ఎల్పీజీ (LPG) ధరలతో పోలిస్తే కంప్రెస్డ్ బయోగ్యాస్ చౌకగా లభిస్తుంది. ప్లాంట్ల ఏర్పాటు, వ్యర్థాల సేకరణ మరియు రవాణా విభాగాల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు.
- బయోగ్యాస్ వ్యర్థాల వాడకం వల్ల రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది.
- బయోగ్యాస్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే గ్యాస్ ను వంట గ్యాస్గా, వాహనాల్లో ఇంధనంగా (Bio-CNG), మరియు విద్యుత్ ఉత్పత్తికి కూడా ఉపయోగించవచ్చు.