...
...
Next Story

CM Chandrababu Delhi Visit : ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు - ప్రధాని మోదీతో భేటీ..! టూర్ షెడ్యూల్ ఇలా

AP CM Chandrababu Delhi Visit : ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటించనున్నారు. విజయనగరం జిల్లాలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు.

Published on: Jul 22, 2026, 07:58:07 IST
Advertisement

AP CM Chandrababu Delhi Visit : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ దేశ రాజధాని న్యూఢిల్లీలో పర్యటించనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం ఎయిర్‌పోర్ట్) ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం.

ఆగస్టు 1న ప్రారంభోత్సవం

ఇవాళ ఢిల్లీకి సీఎం చంద్రబాబు (ఫైల్ ఫొటో)
ఇవాళ ఢిల్లీకి సీఎం చంద్రబాబు (ఫైల్ ఫొటో)

భోగాపురం విమానాశ్రయాన్ని ఆగస్టు 1వ తేదీన వైభవంగా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో ప్రధాని మోదీ పాల్గొని ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితం చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబు స్వయంగా ఆహ్వాన పత్రికను అందజేయనున్నారు.

ఢిల్లీ పర్యటన షెడ్యూల్

నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. సీఎం చంద్రబాబు జులై 22 బుధవారం ఉదయం 7:30 గంటలకు అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 10 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటారు. రోజంతా రాజధానిలో పలు కీలక భేటీల్లో పాల్గొంటారు. బుధవారం రాత్రికి ఢిల్లీలోనే బస చేసి…. మరుసటి రోజు అంటే జులై 23 గురువారం ఉదయం 10:20 గంటలకు తిరిగి అమరావతికి చేరుకుంటారు.

ప్రధాని మోదీతో భేటీతో పాటు, కేంద్ర మంత్రివర్గంలోని పలువురు ప్రముఖులను సీఎం చంద్రబాబు కలవనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్, విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌లతో ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతారు.

ఇక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం…. ఉత్తరాంధ్ర ప్రాంతానికి రవాణా, వ్యాపార కేంద్రంగా మారబోతుందని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. "ఈ ఎయిర్‌పోర్ట్ రాకతో ఉత్తరాంధ్ర గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా మారుతుంది. అంతర్జాతీయ స్థాయిలో కనెక్టివిటీ పెరిగి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెద్దపీట వేస్తుంది. పారిశ్రామికంగా, పర్యాటకంగా ఈ ప్రాంతం అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంది," అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే అమరావతి, విశాఖపట్నంతో పాటు సమీప జిల్లాలకు విదేశీ పెట్టుబడులు, పర్యాటకం పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe