AP Crop Insurance Scheme : ఆంధ్రప్రదేశ్లోని అన్నదాతలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ కీలకమైన అప్డేట్ ఇచ్చింది. వాతావరణ మార్పులు, హఠాత్తుగా సంభవించే ప్రకృతి విపత్తుల వల్ల జరిగే తీవ్ర నష్టాల నుంచి పంటలకు రక్షణ కల్పించేందుకు కూటమి ప్రభుత్వం 'పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం' (RWBCIS)ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకం కింద తమ పంటలకు బీమా చేయించుకోవడానికి అధికారులు చివరి తేదీని ప్రకటించారు. అర్హులైన రైతులు 2026 జూలై 31వ తేదీలోగా తప్పనిసరిగా నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.

తీవ్ర వర్షాభావం, అకాల వర్షాలు, తుఫానులు, ఈదురు గాలులు లేదా వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఏటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటువంటి కష్టకాలంలో రైతాంగానికి ఆర్థికంగా కొండంత అండగా నిలవడమే ఈ పంటల బీమా ముఖ్య ఉద్దేశం. ఈ గడువు ముగిస్తే బీమా చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి, రైతులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తమ సమీప వ్యవసాయ అధికారులను లేదా రైతు సేవా కేంద్రాలను సంప్రదించి పంటల వివరాలను నమోదు చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది.
జూలై 31వ తేదీతో గడువు ముగిసే జిల్లాలు:
రాష్ట్రవ్యాప్తంగా నిర్దేశించిన అనేక జిల్లాల్లో ఈ పథకం నమోదు వేగంగా జరుగుతోంది. జూలై 31వ తేదీ నాటికి గడువు ముగియనున్న జిల్లాల జాబితాను వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా వెల్లడించింది. ఆయా జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి….
- ఎన్టీఆర్
- గుంటూరు
- కాకినాడ
- వైఎస్ఆర్ కడప
- అన్నమయ్య
- విజయనగరం
- శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు
- చిత్తూరు
- శ్రీకాకుళం
- శ్రీ సత్యసాయి
- తిరుపతి
- తూర్పు గోదావరి
- పార్వతీపురం మన్యం
ఆపద సమయంలో లేదా ప్రకృతి వైపరీత్యాలు ముంచెత్తినప్పుడు పంట బీమా ఎంతో రక్షణ ఇస్తుంది. కాబట్టి పైన పేర్కొన్న జిల్లాల్లోని రైతులందరూ సమయాన్ని వృథా చేయకుండా, నిర్ణీత గడువు లోగానే తమ పంటలకు బీమా చేయించుకోవాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేస్తోంది.
ఎలా చేసుకోవాలంటే..?
పంటల బీమా కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. పీఎంఎఫ్బీవై వెబ్సైట్ ( https://pmfby.gov.in/ ) లేదా క్రాప్ ఇన్సూరెన్సు ఫార్మర్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా యాప్లో లాగిన్ అవ్వాలి. వివరాలను ధ్రువీకరించాలి. పంట, భూమి వివరాలను నమోదు చేయాలి. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి. బీమా ప్రీమియం చెల్లించి రసీదు డొన్లోడ్ చేసుకోవచ్చు.
{{/usCountry}}పంటల బీమా కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. పీఎంఎఫ్బీవై వెబ్సైట్ ( https://pmfby.gov.in/ ) లేదా క్రాప్ ఇన్సూరెన్సు ఫార్మర్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా యాప్లో లాగిన్ అవ్వాలి. వివరాలను ధ్రువీకరించాలి. పంట, భూమి వివరాలను నమోదు చేయాలి. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి. బీమా ప్రీమియం చెల్లించి రసీదు డొన్లోడ్ చేసుకోవచ్చు.
{{/usCountry}}