...
...
Next Story

AP SSC Exams 2026 : ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - ఓసారి మీ వివరాలు చెక్ చేసుకోండి..! లాస్ట్ డేట్ ఇదే

ఏపీ టెన్త్ విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. నామినల్‌ రోల్స్‌లో వివరాల సవరణలకు అవకాశం ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. పేరు, పుట్టిన తేదీతో పాటు ఇంకా ఏమైనా వివరాల్లో తప్పులుంటే వెంటనే సరిచేసుకోవాలని అధికారులు సూచించారు.

Published on: Feb 26, 2026, 14:43:30 IST
Advertisement

ఏపీలో పదో తరగతి పరీక్షలకు సమయం దగ్గరపడుతోంది. వచ్చే నెల 16వ తేదీ నుంచి ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. ఈ పరీక్షల కోసం విద్యార్థులు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. విద్యార్థుల నామినల్‌ రోల్స్‌లో వివరాల సవరణలకు అవకాశం కల్పించింది.

ఈ నెల 28 వరకు ఛాన్స్….

ఏపీ టెన్త్ విద్యార్థులకు అప్డేట్
ఏపీ టెన్త్ విద్యార్థులకు అప్డేట్

విద్యార్థుల పేరు, పుట్టిన తేదీ లాంటి వివరాల్లో దొర్లిన తప్పులను వెంటనే సవరించుకోవాలని విద్యాశాఖ పేర్కొంది. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు మాత్రమే గడువు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

గతంలోనే నామినల్ రోల్స్ లో సవరణకు విద్యాశాఖ అవకాశం ఇచ్చింది. దాదాపుగా 9 వేల మందికిపైగా విద్యార్థుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. తద్వారా విద్యార్థులు తప్పుగా ఉన్న వివరాలను సరిచేసుకోగలిగారు. అయితే తాజాగా ఇచ్చిన అవకాశంతో ఇంకా ఏవరైనా విద్యార్థులు ఉంటే వెంటనే వివరాలను ఎడిట్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో ఆలస్యం చేయవద్దని… నిర్లక్ష్యంగా ఉంటే భవిష్యత్తులో ఇబ్బందుసు ఎదుర్కొవాల్సి వస్తుందని చెబుతున్నారు.

మార్చి 16 నుంచి పరీక్షలు

మరోవైపు పదో తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమవుతోంది. మార్చి 16న ప్రారంభమై… ఏప్రిల్‌ ఒకటితో ముగుస్తాయి. హాల్ టికెట్లు మార్చి మొదటి వారంలో విడుదల కానున్నాయి. వీటిని అధికారిక వెబ్ సైట్ తో పాటు మనమిత్ర వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 20వ తేదీన జరగబోయే ఇంగ్లీష్ ఎగ్జామ్… మార్చి 21వ తేదీకి మారింది. మిగతా పరీక్షల పాత షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఏపీ పదో తరగతి పరీక్షలు - షెడ్యూల్…

  • మార్చి 16, 2026 – ఫస్ట్‌ లాంగ్వేజ్‌
  • మార్చి 18, 2026 – సెకండ్‌ లాంగ్వేజ్‌
  • మార్చి 21, 2026 - ఇంగ్లీష్‌
  • మార్చి 23, 2026 – గణితం(మ్యాథ్స్)
  • మార్చి 25, 2026 – ఫిజిక్స్
  • మార్చి 28, 2026 – బయాలజీ
  • మార్చి 30 , 2026 – సోషల్‌ స్టడీస్‌
  • మార్చి 31, 2026 – ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (పేపర్‌ 2)
  • ఏప్రిల్‌ 1, 2026 – ఒకేషనల్‌ కోర్సు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe