...
...
Next Story

AP PGCET 2026 : ఏపీ పీజీసెట్ నోటిఫికేషన్ - ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం, ఇలా అప్లయ్ చేసుకోండి

రాష్ట్రంలోని పీజీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీ సెట్ - 2026 నోటిఫికేషన్ జారీ అయింది. ప్రస్తుతం ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు మార్చి 9వ తేదీతో పూర్తవుతుంది.

Published on: Feb 17, 2026 05:11 AM IST
Advertisement

ఏపీలో పీజీ చేరాలనుకుంటున్న విద్యార్థులకు అలర్ట్ వచ్చేసింది. ఏపీ పోస్టు గ్రాడ్యుయేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ - 2026 నోటిఫికేషన్‌ విడుదలైంది. అంతేకాదు ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

ఏపీ పీజీసెట్ 2026
ఏపీ పీజీసెట్ 2026

ఈ నోటిఫికేషన్ లో భాగంగా 2026 -27 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో (PG Courses) ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ ప్రవేశ పరీక్ష బాధ్యతలను చూస్తోంది.

ముఖ్యమైన తేదీలు…

ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన విద్యార్థులు… మార్చి 9వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక రూ.1000 అపరాధ రుసుముతో మార్చి 13 వరకు, రూ.2000 అపరాధ రుసుముతో మార్చి 16 వరకు, రూ.4000 అపరాధ రుసుముతో మార్చి 19వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం ఉంటుంది.

ఇక రూ.10,000 అపరాధ రుసుముతో మార్చి 23 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 5 నుంచి 11వ తేదీల మధ్య ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏపీ పీజీసెట్ ద్వారా రాష్ట్రంలో ఉన్న 16 విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో 145కి పైగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఏపీ పీజీసెట్ 2026 కి సంబంధించిన ఆన్ లైన్ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ మార్చి 24, 25 తేదీల్లో అందుబాటులోకి వస్తుంది. ఇక ఏప్రిల్ 21వ తేదీన హాల్ టికెట్లు విడుదలవుతాయి. ఏపీ పీజీసెట్ రాసేందుకు అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులతో పాటు సోషియాలజీ, తెలుగు, ఇంగ్లీష్ వాటి కోర్సుల్లో కూడా ప్రవేశాలు పొందొచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe