రేపట్నుంచి ఏపీ పీజీసెట్ 2025 పరీక్షలు - షెడ్యూల్ ఇదే

ఏపీ పీజీసెట్ - 2025 పరీక్షలు జూన్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఎంట్రెన్స్ ఆధారంగా పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. 

Published on: Jun 8, 2025, 14:35:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ పీజీ సెట్‌-2025 పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రేపట్నుంచి(జూన్ 09) నుంచి ఈ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. షెడ్యూల్ నిర్ణయించిన ప్రకారం… జూన్ 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఈ ఎగ్జామ్ జరుగుతాయి. ఈ పరీక్ష కోసం 25 వేలకుపైగా అభ్యర్థులు అప్లికేషన్ చేసుకున్నారు.

ఏపీ పీజీసెట్ - 2025
ఏపీ పీజీసెట్ - 2025

జూన్ 25న ఫలితాలు…

ఏపీ పీజీసెట్పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 30 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీలను జూన్ 11వ తేదీ నుంచి 15 తేదీల మధ్య విడుదల చేస్తారు. వీటిపై 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. జూన్ 25వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.

ఏపీ పీజీసెట్ - 2025 లో సాధించిన ర్యాంకులతో పాటు రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఈ ఎంట్రెన్స్ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పీజీ కాలేజీల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఫలితాల విడుదల తర్వాత కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ఖరారు చేస్తారు.

హాల్ టికెట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి…

  1. ముందుగా https://cets.apsche.ap.gov.in/APSCHE/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో కనిపించే డౌన్లోడ్ హాల్ టికెట్ పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలతో పాటు ఎగ్జామ్ పేపర్ ను ఎంచుకోవాలి.
  4. సబ్మిట్ చేస్తే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

ఏపీ పీజీసెట్ పరీక్షల షెడ్యూల్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More