AP Fire Department Driver Operator Posts : ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీ కోసం పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ, ప్రాథమిక రాత పరీక్ష తేదీలు , ఇతర ముఖ్యమైన వివరాలతో కూడిన పూర్తి షెడ్యూల్ను త్వరలోనే వెల్లడించనున్నారు.

గతంలో కూటమి హయాంలో 2018 నవంబరులో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రాగా…. 8 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు పోస్టుల భర్తీకి రిక్రూట్ మెంట్ బోర్డు చర్యలు చేపట్టింది. అయితే… ఈసారి ఎంపిక ప్రక్రియలో కొన్ని కీలక మార్పులు చేసి దేహదారుఢ్య (పీఈటీ), రాత పరీక్షలను తప్పనిసరి చేశారు.
ఎంపిక విధానంలో కీలక మార్పులు…
గతంలో ఈ పోస్టులకు కేవలం శారీరక కొలతల పరీక్షలు (PMT) నిర్వహించి, డ్రైవింగ్ టెస్ట్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేసేవారు. కానీ ఈసారి నియామక నిబంధనల్లో మార్పులు చేశారు. కొత్త విధానం ప్రకారం ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో సాగుతుంది.
1. శారీరక కొలతల పరీక్ష - దేహదారుఢ్య పరీక్ష : ముందుగా ఎత్తు, ఛాతీ కొలతలను డిజిటల్ విధానంలో కొలుస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి 1600 మీటర్ల (1 మైలు) పరుగు పందెం ఉంటుంది. అభ్యర్థులు ఈ పరుగును 10 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయంలో పూర్తి చేయాలి. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే.
2. డ్రైవింగ్ టెస్ట్ : పరుగు పందెంలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిపుణుల కమిటీ సమక్షంలో 100 మార్కులకు డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. వాహనం స్టార్ట్ చేయడం, గేర్లు మార్చడం, రోడ్డు నిబంధనలు, బ్రేకుల వినియోగం, రివర్సింగ్, మైగ్రేషన్ లోపాలు సరిచేయడం వంటి 8 అంశాలపై పరిశీలిస్తారు. ఇందులో కనీసం 50 మార్కులు సాధించి క్వాలిఫై కావాల్సి ఉంటుంది.
{{/usCountry}}2. డ్రైవింగ్ టెస్ట్ : పరుగు పందెంలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిపుణుల కమిటీ సమక్షంలో 100 మార్కులకు డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. వాహనం స్టార్ట్ చేయడం, గేర్లు మార్చడం, రోడ్డు నిబంధనలు, బ్రేకుల వినియోగం, రివర్సింగ్, మైగ్రేషన్ లోపాలు సరిచేయడం వంటి 8 అంశాలపై పరిశీలిస్తారు. ఇందులో కనీసం 50 మార్కులు సాధించి క్వాలిఫై కావాల్సి ఉంటుంది.
{{/usCountry}}3. రాత పరీక్ష: మొదటి రెండు దశల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు 100 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహా రాత పరీక్ష నిర్వహిస్తారు. మోటార్ వాహన మెకానిజం, ట్రాఫిక్ రూల్స్, రోడ్డు భద్రత వంటి అంశాలపై 3 గంటల వ్యవధిలో ఈ పరీక్ష ఉంటుంది. ఈ రాత పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగానే అభ్యర్థుల తుది ఎంపికను చేపడతారు.
జూలై 1 నాటికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత సాధించి ఉండాలి.నోటిఫికేషన్ తేదీ నాటికి కనీసం 2 సంవత్సరాల చెల్లుబాటు వ్యవధి ఉన్న హెవీ ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఈడబ్ల్యూఎస్, బీసీ , ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. మాజీ సైనికోద్యోగులకు ఆర్మీ సర్వీస్ ఆధారంగా మినహాయింపు లభిస్తుంది.
ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.300 గాను, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.150 గాను నిర్ణయించారు. పూర్తి వివరాలు, జిల్లాల వారీగా ఉన్న ఖాళీల జాబితా కోసం అభ్యర్థులు slprb.ap.gov.in అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.