ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల తేదీలు.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ షెడ్యూల్!
AP SSC Results 2026 : ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ రాసేందుకు అవకాశం ఉంది. దానికి సంబంధించిన షెడ్యూల్ను కూడా విడుదల చేశారు.
ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు 2026 (AP SSC Supplementary Exams)కు సంబంధించి షెడ్యూల్ను కూడా అధికారులు విడుదల చేశారు. ఏపీ పదో తరగతి పరీక్షలు 25-05-2026 నుంచి 04-06-2026 వరకు జరుగుతాయి.

విద్యార్థులు ఆలస్య రుసుము నుంచి తప్పించుకోవడానికి సరైన సమయంలో ఫీజు చెల్లించాలి. ఆలస్య రుసుము లేకుండా.. 01-05-2026 నుంచి 09-05-2026 చెల్లించాలి. రూ.50 ఆలస్య రుసుముతో 10-05-2026 నుంచి 24-05-2026 వరకు చెల్లించవచ్చు. సంబంధిత పాఠశాల హెడ్ మాస్టర్ను కలవాలి.
ఇక రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ షెడ్యూల్ను కూడా అధికారులు ప్రకటించారు. ఇందుకోసం 01-05-2026 ఉదయం 10 గంటల నుంచి 07-05-2026 రాత్రి 11 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి అప్లై చేసుకునేందుకు ఆలస్యం లేకుండా అభ్యర్థులు సంబంధిత స్కూల్ హెడ్ మాస్టర్ను కలవాల్సి ఉంటుంది.
- రీ కౌంటింగ్ ఫీజు ఒక్కో సబ్జెక్ట్కు రూ.500
- రీవెరిఫికేషన్ ఫీజు ఒక్కో సబ్జెక్ట్కు రూ.1000
నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. తమకు వచ్చిన మార్కులపై సంతృప్తి చెందని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. రీకౌంటింగ్లో కేవలం మార్కులను మళ్లీ లెక్కిస్తారు. ఎక్కడైనా మార్కులు వేయడం మర్చిపోయారా అని చూస్తారు. రీ-వెరిఫికేషన్లో మార్కులను మళ్లీ సరిచూస్తారు, జవాబు పత్రం ఫోటోకాపీని మీకు పంపిస్తారు.
ఏపీ పదో తరగతి ఫలితాల్లో మొత్తం ఉత్తీర్ణత శాతం 85.25 శాతానికి పెరిగింది (గత ఏడాది 81.14% నుండి). బాలుర కంటే బాలికలే మెరుగైన ప్రతిభ కనబరిచారు అమ్మాయిలు 87.90 శాతంగా ఉంటే.. అబ్బాయిలు 82.68 శాతంగా పాస్ అయ్యారు. ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణత శాతం 78.39 శాతానికి మెరుగుపడింది. గత ఏడాది 72.8 శాతంగా ఉంది.
- విద్యార్థులు తమ ఫలితాలను ఈ క్రింది మార్గాల ద్వారా పొందవచ్చు:
- అధికారిక పోర్టల్: https://results.bse.ap.gov.in
- 'మన మిత్ర' (WhatsApp Governance): 9552300009 నంబర్కు “Hi” అని పంపండి
- LEAP మొబైల్ అప్లికేషన్
- DigiLocker
- సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల (HM) లాగిన్లలో కూడా ఫలితాలు అందుబాటులో ఉన్నాయి.
- ఇక APOSS ఫలితాలు: https://apopenschool.ap.gov.in ద్వారా లేదా 'మన మిత్ర' (9552300009) లేదా DigiLocker ద్వారా పొందవచ్చు.
విజయం సాధించిన విద్యార్థులందరికీ మంత్రి నారా లోకేశ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈసారి ఉత్తీర్ణులు కాలేకపోయిన వారు.. దయచేసి నిరాశ చెందవద్దని సూచించారు. కుటుంబాలు, ఉపాధ్యాయులు, సమాజం మద్దతుతో, మీరు మరింత బలంగా తిరిగి విజయం సాధించగలరని చెప్పారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


