APCPDCL : ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ప్రారంభం.. మంత్రి గొట్టిపాటి కీలక కామెంట్స్
APCPDCL : రైతులకూ ఇబ్బందులు లేని విద్యుత్ సరఫరానే ధ్యేయమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఉద్యోగుల కృషిలోతనే విద్యుత్ శాఖకు మంచి పేరు తెచ్చుకుందన్నారు.
ప్రజలపై అదనపు భారం లేకుండా నాణ్యమైన విద్యుత్ను అందించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. విజయవాడలోని గుణదలలో రూ.35 కోట్లకు పైగా వెచ్చించి నిర్మించిన ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయాన్ని మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడారు... రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరాకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

'ఉద్యోగుల కృషితో పనితీరు కారణంగా విద్యుత్ శాఖకు మంచి పేరు వచ్చింది. అంతరాయాలు, లో ఓల్టేజ్ సమస్యలు లేకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించే దిశగా విద్యుత్ శాఖ పని చేస్తోంది. పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ వంటి పథకాల అమలులో కూడా సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రశంసనీయం. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజలకు విద్యుత్ శాఖపై నమ్మకం పెరుగుతోంది. 95 శాతం ప్రజల సంతృప్త స్థాయిని అందుకునేలా సిబ్బంది మరింత సమర్థవంతంగా పని చేయాలి.' అని మంత్రి గొట్టిపాటి పిలుపునిచ్చారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల రెండు నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జెన్కో రికార్డు స్థాయి విద్యుత్ ఉత్పత్తిని సాధించిందని మంత్రి గొట్టిపాటి ప్రశంసించారు. రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను అధిగమించేందుకు, పవర్ లాసెస్ను తగ్గించేందుకు ప్రణాళికాబద్ధంగా విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నామని పేర్కొన్నారు.
నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రాష్ట్రవ్యాప్తంగా సబ్ స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. మరో వైపు అన్నదాతకు కూడా పీఎం కుసుమ్ ద్వారా పగటి పూటే 9 గంటల నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ను త్వరలోనే అందిస్తామని మంత్రి గొట్టిపాటి తెలిపారు. కుసుమ్ పథకానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, పనులు కూడా ప్రారంభమవుతాయని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 10 చోట్ల టెండర్లు ఇప్పటికే పిలిచామని చెప్పారు.
విద్యుత్ శాఖ సిబ్బంది ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ ప్రత్యేక సేవలు అందించారని మంత్రి గొట్టిపాటి అభినందించారు. అదే విధంగా సీఎం చంద్రబాబు ఆశయ సాధన కోసం సిబ్బంది అందరూ మరింత కష్టపడి విధులు నిర్వహించి విద్యుత్ శాఖకు మంచి పేరు తీసుకు రావాలని మంత్రి గొట్టిపాటి పిలుపునిచ్చారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper












