2027 నాటికి రెవెన్యూ సమస్య లేకుండా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గురువారం నారావారిపల్లెలో మీడియాతో మాట్లాడిన ఆయన… ప్రతి నెలా 9న పట్టాదారు పుస్తకాలు అందిస్తామని ప్రకటించారు. జాయింట్ కలెక్టర్లు ఈ రెవెన్యూ సమస్యలపైనే ఈ ఏడాది మొత్తం పని చేస్తారని చెప్పుకొచ్చారు.

గత ప్రభుత్వంలో ఇష్టం లేని వారి భూములు 22ఏలో పెట్టారని… గందరగోళం సృష్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.కానీ తాము ఏడాది టార్గెట్ పెట్టుకుని సర్వే పూర్తి చేసి రూపాయి కూడా లేకుండా క్యూఆర్ కోడ్ తో పుస్తకాలు ఇస్తున్నామని చెప్పారు. 2027 నాటికి రెవెన్యూ సమస్య లేకుండా పరిష్కరిస్తామని ఉద్ఘాటించారు.
పర్యాటకంలో భాగంగా తిరుపతి, రూరల్ ప్రాంతంలో హోం స్టేలకు ప్రాధాన్యం ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. గురువారం నారావారిపల్లెలో మీడియాతో మాట్లాడిన ఆయన…. తిరుపతి చెరువులకు, విజయవాడ కెనాల్స్, విశాఖకు బీచ్ కు ప్రసిద్ధి అని చెప్పారు. తిరుపతి రాబోయే రోజుల్లో వెడ్డింగ్ డెస్టినేషన్ హబ్ గా మారుతుందన్నారు. తిరుపతి, విశాఖ, అమరావతిని మెగా సిటీలుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.
“జన్మభూమిని ఎవరూ మర్చిపోకూడదు. ప్రభుత్వ పాలసీలతో చదవుకుని ఉన్నత స్థితికి చేరుకున్నవారుఉన్నారు. అయినా చాలామందిలో జీవన ప్రమాణాలు లేవు. పీ4 లోభాగంగా మార్గదర్శి, బంగారు కుటుంబాల వ్యవస్థ ద్వారా పేదరికం తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నాం. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తేనే నిజమైన సమసమాజం అవుతుంది. అందుకే పీ4 తీసుకొచ్చి 10 లక్షల కుటుంబాలను దత్తత తీసుకున్నాం. 2026లో దీనిపై మరింత ఫోకస్ పెడతాం. ఒక్క డబ్బే కాదు...మేనేజ్మెంట్ స్కిల్ కావాలి” అని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
“స్వర్ణ నారావారిపల్లెకు గతేడాది శ్రీకారం చుట్టాం. ఇక్కడ జీవన ప్రమాణాలు, ఆదాయం పెంచాలని స్టార్ట్ చేశాం. రంగంపేట, కందులవారిపల్లె, చిన్నరామపురం 3 పంచాయతీలను పైలట్ గా తీసుకున్నాం. స్పెషల్ ఆఫీసర్ను పెట్టుకుని గ్రామాల్లో ఏం చేయాలో చేస్తున్నాం. మరుగుదొడ్లు, దీపం, పింఛన్లు అందిస్తున్నాం. ఇల్లు లేని వారిని గుర్తించాం. రోడ్ల నిర్మాణం కూడా చేపడుతున్నాం. రంగంపేటను జాతీయ రహదారికి అనుసంధానం చేస్తాం. చెత్తను వంద శాతం సేకరించి శాగ్రిగేషన్ చేస్తున్నాం. తడి చెత్త నుంచి కంపోస్ట్, పొడి చెత్తను సర్య్కులర్ ఎకానమీకి పంపుతున్నాం” అని పేర్కొన్నారు.
{{/usCountry}}“స్వర్ణ నారావారిపల్లెకు గతేడాది శ్రీకారం చుట్టాం. ఇక్కడ జీవన ప్రమాణాలు, ఆదాయం పెంచాలని స్టార్ట్ చేశాం. రంగంపేట, కందులవారిపల్లె, చిన్నరామపురం 3 పంచాయతీలను పైలట్ గా తీసుకున్నాం. స్పెషల్ ఆఫీసర్ను పెట్టుకుని గ్రామాల్లో ఏం చేయాలో చేస్తున్నాం. మరుగుదొడ్లు, దీపం, పింఛన్లు అందిస్తున్నాం. ఇల్లు లేని వారిని గుర్తించాం. రోడ్ల నిర్మాణం కూడా చేపడుతున్నాం. రంగంపేటను జాతీయ రహదారికి అనుసంధానం చేస్తాం. చెత్తను వంద శాతం సేకరించి శాగ్రిగేషన్ చేస్తున్నాం. తడి చెత్త నుంచి కంపోస్ట్, పొడి చెత్తను సర్య్కులర్ ఎకానమీకి పంపుతున్నాం” అని పేర్కొన్నారు.
{{/usCountry}}