...
...
Next Story

SCR Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్... హైదరాబాద్ - గోరఖ్‌పూర్ ప్రత్యేక రైళ్ల పొడిగింపు!

Hyderabad Gorakhpur Special Trains : హైదరాబాద్ డెక్కన్ - గోరఖ్‌పూర్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్ల సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జూలై, ఆగస్టు నెలల్లో అదనపు ట్రిప్పులను నడపనున్నారు.

Published on: Jun 27, 2026, 16:10:26 IST
Advertisement

Hyderabad Gorakhpur Special Trains : దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికులకు మరో తీపి కబురు అందించింది. హైదరాబాద్, ఉత్తరప్రదేశ్ మధ్య ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో, ప్రయాణికుల అదనపు రద్దీని నియంత్రించేందుకు హైదరాబాద్ డెక్కన్ – గోరఖ్‌పూర్ – హైదరాబాద్ డెక్కన్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

హైదరాబాద్ - గోరఖ్‌పూర్ ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు!
హైదరాబాద్ - గోరఖ్‌పూర్ ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు!

దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం… రెండు దిశలలోనూ చెరో 5 ట్రిప్పుల చొప్పున మొత్తం 10 అదనపు సర్వీసులను నడపనున్నారు. ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్లలో ఆగుతాయి.

రైలు నంబర్ 07075 (హైదరాబాద్ - గోరఖ్‌పూర్):

హైదరాబాద్ నుంచి గోరఖ్‌పూర్ వెళ్లే ఈ ప్రత్యేక రైలు ప్రతి వారం శుక్రవారం అందుబాటులో ఉంటుంది. జూలై నెలలో ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి ఈ సర్వీసును పొడిగించారు. ఈ రైలు జూలై 3, జూలై 10, జూలై 17, జూలై 24 , జూలై 31వ తేదీల్లో హైదరాబాద్ డెక్కన్ స్టేషన్ నుంచి నిర్దేశిత సమయానికి బయలుదేరుతుంది. ఈ పొడిగింపు కాలంలో మొత్తం 5 ట్రిప్పుల పాటు ఈ రైలు సేవలు అందిస్తుంది.

రైలు నంబర్ 07076 (గోరఖ్‌పూర్ - హైదరాబాద్):

తిరుగు ప్రయాణంలో గోరఖ్‌పూర్ నుంచి హైదరాబాద్ వచ్చే ఈ ప్రత్యేక రైలు ప్రతి వారం ఆదివారం నడుస్తుంది. ఈ సర్వీసును జూలైతో పాటు ఆగస్టు మొదటి వారం వరకు పొడిగించారు. ఈ రైలు జూలై 5, జూలై 12, జూలై 19, జూలై 26, ఆగస్టు 2వ తేదీల్లో గోరఖ్‌పూర్ జంక్షన్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతుంది. ఈ దిశలో కూడా రైల్వే శాఖ 5 ట్రిప్పులను కేటాయించింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks