Fly91 Tirupati Rajahmundry Flights : ప్రాంతీయ విమానయాన సంస్థ ‘ఫ్లై91’ (Fly91) ఆంధ్రప్రదేశ్లో తన విమాన సేవలను వేగంగా విస్తరిస్తోంది. తిరుపతి నుంచి విజయవాడకు విమాన సేవలు ప్రారంభించిన మరుసటి రోజే… శుక్రవారం(సెప్టెంబర్ 11) నాడు తిరుపతి - రాజమండ్రి మార్గంలో కూడా ఈ సంస్థ తమ విమాన రాకపోకలను అధికారికంగా ప్రారంభించింది. ఈ కొత్త సర్వీసుతో కలిపి ఫ్లై91 విమానయాన నెట్వర్క్ దేశవ్యాప్తంగా మొత్తం 13 గమ్యస్థానాలకు చేరుకుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు గురువారం రోజున ఫ్లై91 తొలి విమానాన్ని జెండా ఊపి ప్రారంభించారు. తిరుపతిని ప్రధాన కేంద్రంగా చేసుకుని హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి నగరాలను అనుసంధానించే నూతన విమాన సేవలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గురువారం తిరుపతి-విజయవాడ సర్వీస్ మొదలవ్వగా… ఇవాళ్టి (శుక్రవారం) నుంచి తిరుపతి-రాజమండ్రి విమాన సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్లో విమానయాన సేవలు అందిస్తున్న ప్రాంతాల్లో తిరుపతి ఫ్లై91 సంస్థకు మూడవ గమ్యస్థానంగా నిలిచింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిధిలో ఈ సంస్థ మొత్తం నాలుగు ప్రధాన నగరాలకు విమాన సేవలు అందిస్తోంది.
టైమింగ్స్ వివరాలు :
- తిరుపతి - హైదరాబాద్ : ఈ రెండు నగరాల మధ్య ప్రతిరోజూ నేరుగా ఒక విమాన సర్వీస్ నడుస్తుంది.
- తిరుపతి - విజయవాడ : వారానికి నాలుగు రోజులు చొప్పున మంగళ, గురు, శని మరియు ఆదివారాల్లో ఈ విమాన సేవలు అందుబాటులో ఉంటాయి.
- తిరుపతి - రాజమండ్రి : వారానికి మూడు రోజులు చొప్పున సోమ, బుధ మరియు శుక్రవారాల్లో ఈ రూట్లో విమానాలు నడుస్తాయి.
ప్రస్తుతం ఫ్లై91 సంస్థ దేశంలోని ప్రధాన నగరాలైన గోవా, సింధుదుర్గ్, జల్గావ్, సోలాపూర్, పుణే, బెంగళూరు, హైదరాబాద్, అగత్తి, కొచ్చి, హుబ్బళ్లి, రాజమండ్రి, విజయవాడ మరియు తిరుపతి నగరాలను అనుసంధానిస్తూ తన సేవలను విస్తరించింది.
{{/usCountry}}ప్రస్తుతం ఫ్లై91 సంస్థ దేశంలోని ప్రధాన నగరాలైన గోవా, సింధుదుర్గ్, జల్గావ్, సోలాపూర్, పుణే, బెంగళూరు, హైదరాబాద్, అగత్తి, కొచ్చి, హుబ్బళ్లి, రాజమండ్రి, విజయవాడ మరియు తిరుపతి నగరాలను అనుసంధానిస్తూ తన సేవలను విస్తరించింది.
{{/usCountry}}