ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి ప్రయాణించే భక్తులకు, కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారికి రైల్వే శాఖ మైండ్ మంచి న్యూస్ అందించింది. తిరుపతి-శివమొగ్గ నగరాల మధ్య ప్రతిపాదించిన సరికొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సర్వీసుకు సంబంధించి రైల్వే బోర్డు నుంచి సానుకూల స్పందన లభించినట్లు తిరుపతి ఎంపీ గురుమూర్తి వెల్లడించారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి నిత్యం కర్ణాటక వ్యాప్తంగా వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. శివమెుగ్గ నుంచి ఎక్కువ మంది వస్తారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి రైల్వే స్టేషన్ మౌలిక వసతుల పెంపుతో పాటు, కర్ణాటకను కలుపుతూ కొత్త వందే భారత్ రైలును ప్రారంభించాలని ఎంపీ గురుమూర్తి రైల్వే బోర్డు ఛైర్మన్ అండ్ సీఈఓకు గతంలో వినతిపత్రం సమర్పించారు.
ఎంపీ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన రైల్వే బోర్డు.. ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. శివమొగ్గ టౌన్ నుంచి ఐటీ రాజధాని బెంగళూరు మీదుగా తిరుపతికి ఈ కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ను నడిపేందుకు ప్రాథమిక ప్రతిపాదన రూపుదిద్దుకుందని రైల్వే శాఖ ఎంపీకి సమాచారం అందించింది.
ఈ నూతన రైలు సర్వీసు అందుబాటులోకి వస్తే ఆధ్యాత్మిక, విద్య, వైద్య, వ్యాపార రంగాలకు చెందిన వారికి ఎంతో లబ్ధి చేకూరనుంది. శివమొగ్గ, బెంగళూరు పరిసర ప్రాంతాల భక్తులు అతి తక్కువ సమయంలో సౌకర్యవంతంగా తిరుపతికి చేరుకోవచ్చు.
ఉద్యోగులు, వ్యాపారులకు బెంగళూరు-తిరుపతి మధ్య వేగవంతమైన ప్రయాణ సదుపాయం లభిస్తుంది. బెంగళూరు, తిరుపతిలలోని ప్రముఖ ఆసుపత్రులకు, విద్యాసంస్థలకు వెళ్లేవారికి ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా మారనుంది.
తన విన్నపానికి తక్షణమే స్పందించిన రైల్వే బోర్డు చైర్మన్కు ఎంపీ మద్దిల గురుమూర్తి ధన్యవాదాలు తెలిపారు. మిగిలిన సాంకేతిక, పరిపాలనా ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి, త్వరలోనే ఈ వందే భారత్ రైలును ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ఈ రైలు వేళలు, ఆగు స్టేషన్లు, టికెట్ ధరల వివరాలను రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించనుంది.
వందే భారత్ స్లీపర్ రైలు
{{/usCountry}}తన విన్నపానికి తక్షణమే స్పందించిన రైల్వే బోర్డు చైర్మన్కు ఎంపీ మద్దిల గురుమూర్తి ధన్యవాదాలు తెలిపారు. మిగిలిన సాంకేతిక, పరిపాలనా ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి, త్వరలోనే ఈ వందే భారత్ రైలును ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ఈ రైలు వేళలు, ఆగు స్టేషన్లు, టికెట్ ధరల వివరాలను రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించనుంది.
వందే భారత్ స్లీపర్ రైలు
{{/usCountry}}వందే భారత్ ట్రైన్ ఇప్పుడు రాత్రివేళ ప్రయాణాల వైపు అడుగులు వేస్తోంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం వందే భారత్ స్లీపర్ సర్వీసులను విస్తరించేందుకు భారతీయ రైల్వే రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా 260 వందే భారత్ స్లీపర్ రైళ్లను తయారు చేయాలని సంకల్పించింది. ఈ స్లీపర్ సిరీస్లో తొలి రైలు గువాహాటీ-హౌరా మార్గంలో ఇప్పటికే ప్రయాణికులకు అందుబాటులోకి రాగా, రెండో రైలు ప్రస్తుతం పట్టాలపై ట్రయల్ రన్స్ పూర్తి చేసుకుంటోంది. ఈ రెండో రైలును బెంగళూరు - ముంబై మార్గంలో నడిపే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ, దీనిపై రైల్వే శాఖ అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
ప్రస్తుతం సిద్ధమవుతున్న 16 కోచ్ల రైలులో 11 ఏసీ 3-టైర్, 4 ఏసీ 2-టైర్, 1 ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ ఉంటాయి. రాత్రివేళ సుఖవంతమైన ప్రయాణం కోసం మెత్తటి బెర్త్లు, రీడింగ్ లైట్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, ఆటోమేటిక్ డిస్ప్లే బోర్డులు, సమాచారాన్ని అందించే స్పీకర్ వ్యవస్థలను అమర్చారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఆటోమేటిక్ తలుపులు, కోచ్ల మధ్య శబ్దం రాకుండా ఉండేలా సీల్డ్ గ్యాంగ్వేలను ఏర్పాటు చేశారు.