Andhra Pradesh Heatwave Alert : రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు ముదురుతోంది. భానుడి భగభగలకు తోడు ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ఎండలు మరింత తీవ్రరూపం దాల్చనున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే గరిష్ట స్థాయికి చేరుకుంటాయని... ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరించింది.
ఈ జిల్లాలకు హెచ్చరికలు…

ఉత్తర కోస్తా, మధ్య కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరే ప్రమాదం ఉందనే అంచనాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో ఎండ తీవ్రత అత్యధికంగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి ఏకంగా 47 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది.
నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోనున్నాయి. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు 43 నుండి 44 డిగ్రీల వరకు రికార్డయ్యే ఛాన్స్ ఉంది. అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా.
71 మండలాల్లో తీవ్ర వడగాల్పులు:
ఉష్ణోగ్రతలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వడగాల్పుల తీవ్రత కూడా ప్రమాదకరంగా మారనుంది. రాష్ట్రంలోని మొత్తం 71 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో 20 మండలాలు, శ్రీకాకుళంలో 18, కాకినాడలో 9, కోనసీమలో 7, విజయనగరంలో 6, పోలవరంలో 4, విశాఖపట్నంలో 4 మండలాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఇవి కాకుండా మరో 277 మండలాల్లో సాధారణ వడగాల్పుల ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు పగటిపూట ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా నిరంతరం మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ (ORS) ద్రావణం వంటివి తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
{{/usCountry}}ఈ తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు పగటిపూట ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా నిరంతరం మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ (ORS) ద్రావణం వంటివి తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
{{/usCountry}}