వేసవి రద్దీని తగ్గించడానికి భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. రైలు నెం. 08581 విశాఖపట్నం-ఎస్ఎమ్వి బెంగళూరు వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు మే 22 నుండి జూన్ 26 వరకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 03.20 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి, సాయంత్రం 04.02 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 01.50 గంటలకు ఎస్ఎమ్వి బెంగళూరు చేరుకుంటుంది(మొత్తం 6 ట్రిప్పులు).

తిరుగు ప్రయాణంలో 08582 నంబరు గల ఎస్ఎమ్వీ బెంగళూరు - విశాఖపట్నం వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్, మే 23 నుండి జూన్ 27 వరకు ప్రతి శనివారం మధ్యాహ్నం 03.50 గంటలకు బెంగళూరు నుండి బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 12.28 గంటలకు దువ్వాడ చేరుకుని, అక్కడ నుండి మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి బయలుదేరి, మధ్యాహ్నం 13.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది(మొత్తం 06 ట్రిప్పులు).
ఇక కాచిగూడ-విశాఖపట్నం వన్ వే స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు నెం. 07810, మే 15వ తేదీ శుక్రవారం రాత్రి 08.45 గంటలకు కాచిగూడ నుండి బయలుదేరుతుంది. మరుసటి రోజు (శనివారం) ఉదయం 09.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
నాందేడ్ - నిజాముద్దీన్
వేసవి సెలవుల వేళ ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు, అదనపు రద్దీని క్లియర్ చేసేందుకు వివిధ గమ్యస్థానాల మధ్య సమ్మర్ స్పెషల్ రైళ్లను భారతీయ రైల్వే నడుపుతోంది.
మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి నిజాముద్దీన్ మధ్య ప్రత్యేక సర్వీసులను రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది.
- రైలు నంబర్ 07660: మే 22న (శుక్రవారం) ఉదయం 06:35 గంటలకు నాందేడ్లో బయలుదేరి... మరుసటి రోజు (శనివారం) మధ్యాహ్నం 14:30 గంటలకు నిజాముద్దీన్ చేరుకుంటుంది.
- రైలు నంబర్ 07661: తిరుగు ప్రయాణంలో మే 25న (సోమవారం) తెల్లవారుజామున 01:25 గంటలకు నిజాముద్దీన్లో బయలుదేరి, మరుసటి రోజు (మంగళవారం) ఉదయం 09:45 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది.
ఈ రైళ్లు ఆదిలాబాద్, నాగ్పూర్, రాణి కమలాపతి, ఝాన్సీ మరియు ఆగ్రా కాంట్ స్టేషన్లలో ఆగుతాయి. ఇందులో కేవలం స్లీపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు మాత్రమే ఉంటాయి.
విశాఖపట్నం - నిజాముద్దీన్
- విశాఖపట్నం నుంచి నిజాముద్దీన్కు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధాన స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయి.
- రైలు నంబర్ 08513: మే 21న (గురువారం) సాయంత్రం 17:40 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి, శనివారం ఉదయం 11:40 గంటలకు నిజాముద్దీన్ చేరుకుంటుంది.
- రైలు నంబర్ 08514: తిరుగు ప్రయాణంలో మే 24న (ఆదివారం) రాత్రి 23:55 గంటలకు నిజాముద్దీన్లో బయలుదేరి, మంగళవారం రాత్రి 22:40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
ఈ రైళ్లు ఆదిలాబాద్, నాగ్పూర్, రాణి కమలాపతి, ఝాన్సీ మరియు ఆగ్రా కాంట్ స్టేషన్లలో ఆగుతాయి. ఇందులో కేవలం స్లీపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు మాత్రమే ఉంటాయి.
విశాఖపట్నం - నిజాముద్దీన్
- విశాఖపట్నం నుంచి నిజాముద్దీన్కు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధాన స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయి.
- రైలు నంబర్ 08513: మే 21న (గురువారం) సాయంత్రం 17:40 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి, శనివారం ఉదయం 11:40 గంటలకు నిజాముద్దీన్ చేరుకుంటుంది.
- రైలు నంబర్ 08514: తిరుగు ప్రయాణంలో మే 24న (ఆదివారం) రాత్రి 23:55 గంటలకు నిజాముద్దీన్లో బయలుదేరి, మంగళవారం రాత్రి 22:40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
దువ్వాడ, అనకాపల్లి, తుని, రాజమండ్రి, విజయవాడ, బలార్షా, నాగ్పూర్, రాణి కమలాపతి, ఝాన్సీ మరియు ఆగ్రా కాంట్ స్టేషన్లలో ఈ రైలు ఆగుతాయి. ఇవి కూడా స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లతో నడుస్తాయి.