ఏపీలోని కాలేజీలు, యూనివర్సిటీలకు కీలక అప్డేట్.. రిజిస్ట్రేషన్పై ఉన్నత విద్యామండలి ఆదేశాలు!
ఆంధ్రప్రదేశ్లోని కాలేజీలు, వర్సిటీలకు ఉన్నత విద్యామండలి కీలక ఆదేశాలు జారీ చేసింది. 2025-26, 2026-27 విద్యా సంవత్సరాలకు గాను కొత్త విద్యాసంస్థలు వెంటనే AISHE పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్-చైర్పర్సన్ ప్రొఫెసర్ కె. రత్న శీల మణి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 'ఆల్-ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్' (AISHE) రిజిస్ట్రేషన్ పొందని అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, స్వతంత్ర విద్యాసంస్థలు తక్షణమే AISHE పోర్టల్ ద్వారా తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. అయితే ఇప్పటికే AISHE కోడ్లను కలిగి ఉన్న విద్యాసంస్థలు మళ్లీ నమోదు చేసుకోవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు.

తాజాగా ఒక ప్రకటనలో ఉన్నత విద్యామండలి వైస్-చైర్పర్సన్ ఈ విషయాలను వెల్లడించారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా కొత్త విద్యాసంస్థలు, ఇంతవరకు రిజిస్టర్ చేసుకోని సంస్థల కోసం 2025-26, 2026-27 విద్యా సంవత్సరాలకు గాను AISHE పోర్టల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించినట్లు ఆమె తెలిపారు.
AISHE అనేది కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఏటా ఆన్లైన్ ద్వారా నిర్వహించే ఒక సమగ్ర వెబ్ ఆధారిత సర్వే. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా రంగంలో నాణ్యతను, పారదర్శకతను పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ సర్వే ద్వారా కింది కీలక సమాచారాన్ని సేకరిస్తారు:
- విద్యార్థుల నమోదు సంఖ్య
- అధ్యాపకుల సంఖ్య మరియు వారి వివరాలు
- విద్యా కార్యక్రమాలు/కోర్సులు
- మౌలిక సదుపాయాలు
- విద్యాసంస్థల ఆర్థిక వనరుల వివరాలు
ఈ విధంగా సేకరించిన డేటా దేశంలో విద్యా ప్రణాళికల రూపకల్పన, కొత్త విధానాల అమలు, ఉన్నత విద్యా రంగ వృద్ధికి అత్యంత కీలకమైన వనరుగా మారుతుంది.
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రధాన AISHE సర్వే ఇంకా ప్రారంభం కాలేదని వైస్-చైర్పర్సన్ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి కేవలం కొత్త సంస్థల నమోదుకు మాత్రమే విండో ఓపెన్ అయిందని తెలిపారు. న్యూఢిల్లీలోని AISHE ప్రధాన కార్యాలయం నుండి ఆదేశాలు అందిన వెంటనే, డేటా సమర్పణకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, గడువు వివరాలను రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సమాచారం అందిస్తామని పేర్కొన్నారు.
అర్హత కలిగిన అన్ని విద్యాసంస్థలు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. జాతీయ స్థాయి డేటాబేస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఉన్నత విద్యా డేటా కచ్చితంగా, సమగ్రంగా నమోదు కావాలంటే అన్ని కళాశాలల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


