Campus Placements : క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో అదరగొట్టిన మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులు

MBU Campus Placements : మోహన్ బాబు యూనివర్సిటీలో క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో పలువురు విద్యార్థులు మంచి ప్యాకేజీని అందుకున్నారు. మెుదటి దశలో 415 మందికిపైగా విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు.

Published on: Mar 09, 2026 4:08 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మోహన్ బాబు యూనివర్సిటీ.. 2025-26 విద్యా సంవత్సరానికి క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లను ఘనంగా ప్రారంభించింది. ఇన్ఫోసిస్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీలలో మొదటి దశలో 415 మందికి పైగా విద్యార్థులు స్థానాలను పొందారు. 29 మంది విద్యార్థులు రూ.21 లక్షల ప్యాకేజీలతో ఆఫర్‌లను అందుకున్నారు. రెండు ప్రధాన రిక్రూటర్ల నుండి అవకాశాలను అందుకోవడం, యూనివర్సిటీ నాణ్యమైన విద్యకు నిదర్శనం అని అధికారులు తెలిపారు. మరో ప్లేస్‌మెంట్ సీజన్‌కు అధికమంది విద్యార్థులు ఉద్యోగాలు పొందుతారని యూనివర్సిటీ పేర్కొంది.

మోహన్ బాబు యూనివర్సిటీ
మోహన్ బాబు యూనివర్సిటీ

కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఏఐ అండ్ ఎంఎల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డేటా సైన్స్‌లలో B.Tech ప్రోగ్రామ్‌లను ప్లేస్‌మెంట్‌లు ఉన్నాయి. ఇది యూనివర్సిటీలో సాంకేతిక విద్యకు ఇస్తున్న ప్రాముఖ్యతను, ఉపాధిపై దృష్టిని నొక్కి చెబుతుందని అధికారులు వెల్లడించారు. మోహన్ బాబు యూనివర్సిటీలో నిర్మాణాత్మక, శిక్షణా వ్యవస్థతో ఇది సాధ్యమైందన్నారు. ఎంబీయూ ప్రముఖ పరిశ్రమ భాగస్వాములతో వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలు చేసుకుంటుందన్నారు. విద్యార్థులు మొదటి రోజు నుండే పరిశ్రమకు సిద్ధంగా ఉన్నారని యూనివర్సిటీ తెలియజేస్తుందన్నారు. దానికి తగ్గట్టుగా విద్యార్థులను తయారుచేస్తామని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు.

ఎంబీయూ ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుందని యూనివర్సిటీ తెలిపింది. ప్రపంచ ప్రమాణాలకు తగ్గట్టుగా విద్యార్థులను తయారుచేస్తుందన్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అసెస్‌మెంట్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా.. విద్యార్థులు కోడింగ్ నైపుణ్యం, లాజికల్ రీజనింగ్, డొమైన్ జ్ఞానం, రియల్-టైమ్ ప్రాబ్లమ్ సాల్వింగ్‌‍‌పై అవగాహన తెప్పించేలా బోధన ఉంటుందన్నారు. ఈ క్రమబద్ధమైన డేటా-ఆధారిత విధానం ప్లేస్‌మెంట్‌లలో ప్రవేశించే ముందు పరిశ్రమకు సిద్ధంగా ఉన్నారని కన్ఫామ్ చేస్తుంది.

విద్యార్థులకు టెక్నికల్ ఫౌండేషన్ ద్వారా.. ఎంబీయూ నిర్మాణాత్మక కమ్యూనికేషన్, కెరీర్ సంసిద్ధత కార్యక్రమాలతో నిపుణులను సృష్టిస్తుందని యూనివర్సిటీ తెలిపింది. ఇది విద్యార్థుల్లో కమ్యూనికేషన్, విశ్వాసాన్ని పెంచుతుంది. ఎడ్యుకేషన్ కోర్సుతోపాటు ఇంటెన్సివ్ స్పెషల్ కెరీర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఇంటర్వ్యూకు రెడీ అవ్వడం, ఆప్టిట్యూడ్ స్కిల్స్, కార్పొరేట్ ధోరణిపై దృష్టి పెడుతుంది.

అంతేకాదు ఇది విద్యార్థులకు ఎంటర్‌ప్రెన్యూర్, స్టార్టప్ ఇంక్యుబేషన్, ఆలోచన ధ్రువీకరణకు మద్దతు ఇస్తుంది. ఇది విద్యార్థులు సాంప్రదాయ కెరీర్ మార్గాలతో పాటు ఎంటర్‌ప్రైజ్ సృష్టికి వీలు కల్పిస్తుంది. గ్రాడ్యుయేట్లు ఉపాధికి మాత్రమే కాకుండా నాయకత్వం, ఆవిష్కరణలకు సిద్ధం చేస్తుంది మోహన్ బాబు యూనివర్సిటీ.

'ఈ సంవత్సరం నియామకాలు నిరంతర క్రమశిక్షణకు ఫలితం. విద్యార్థుల ఇంటర్వ్యూలకు సహాయం చేయడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా పోటీ పడటానికి, మొదటి రోజు నుండి వారిని సన్నద్ధం చేయడమే మా లక్ష్యం. భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న నిపుణులను నిర్మిస్తున్నాం. రాబోయే సంవత్సరాల్లో మరింత ప్లేస్‌మెంట్స్ సాధిస్తాం.' అని ఎంబీయూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ట్రస్టీ వినయ్ మహేశ్వరి అన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More