హైదరాబాద్ నగరంలోని చర్లపల్లి, తమిళనాడులోని నాగర్కోయిల్ మధ్య కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ పట్టాలెక్కనుంది. ఇటీవలనే రైల్వేశాఖ ప్రకటన కూడా విడుదల చేసింది. ఇప్పటికే రెండు అమృత్ భారత్ సర్వీసులు నడుస్తుండగా… ఈ కొత్త సర్వీస్ తో కలిపి వీటి సంఖ్య మూడుకు చేరనుంది.
ఈనెల 11 నుంచి ప్రారంభం…!

{{^htLoading}} {{/htLoading}}
ప్రస్తుతం హైదరాబాద్ సిటీ నుంచి ముజఫర్పూర్, మరో ట్రైన్ తిరువనంతపురం మధ్య నడుస్తున్నాయి. తాజాగానే నాగర్కోయిల్ - చర్లపల్లి(హైదరాబాద్) మధ్య మరో ట్రైన్ ను రైల్వేశాఖ ప్రకటించింది. అయితే ఈ కొత్త సర్వీసుకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. ఈనెల 11వ తేదీ నుంచి ఈ ట్రైన్ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని రైల్వే వర్గాలు తెలిపారు.
- దక్షిణాది రాష్ట్రాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు సౌకర్యార్థం కోసం భారతీయ రైల్వే…. కొత్తగా నాగర్ కోయిల్-చర్లపల్లి-నాగర్ కోయిల్ మధ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు సేవలను ప్రకటించింది.
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను అనుసంధానిస్తూ ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు సేవలు అందించనున్నది.
- చర్లపల్లి(హైదరాబాద్) నుంచి బయలుదేరే ఈ ట్రైన్…. నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట్, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, పాలక్కాడ్, ఎర్నాకులం, కొట్టాయం, కొల్లాం మీదుగా నాగర్ కోయిల్(తమిళనాడు) కు చేరుకుంటుంది.
- సుమారు 1500 కిలోమీటర్ల పైగా దూరం ప్రయాణించే ఈ రైలు సుమారు 30 నుంచి 31 గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటుంది.
- సాధారణ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ రైళ్లలో స్లీపర్ క్లాస్ బోగీలు, జనరల్ బోగీలు, ఛార్జింగ్ పాయింట్లు, బయోటాయిలెట్లు, సీసీటీవీ కెమెరాలు వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
- సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు పేద, మధ్యతరగతి ప్రయాణికులకు తక్కువ టికెట్ ధరతో అధునాతన సౌకర్యాలతో కూడిన ప్రయాణం… ఈ ట్రైన్ ద్వారా పొందొచ్చు.
{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}