Bhogapuram International Airport : ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేయబోతున్న 'భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం' ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 1వ తేదీన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రపంచ స్థాయి విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన ఖరారు కావడంతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం దీనిపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

2014 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ను…. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేవలం రెండేళ్ల వ్యవధిలోనే అత్యంత వేగంగా పూర్తి చేసింది. విమానాశ్రయ నిర్వహణకు అవసరమైన 8 కీలక చట్టబద్ధమైన అనుమతులు ఇప్పటికే లభించినట్లు నిర్మాణ సంస్థ జీఎంఆర్ (GMR) ప్రతిప్రతినిధులు, పౌర విమానయాన శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకను ఉత్తరాంధ్ర ప్రజలు గర్వపడేలా, ఒక పండుగ వాతావరణంలో అత్యంత వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఉత్తరాంధ్రకు గేమ్ ఛేంజర్ - సీఎం చంద్రబాబు
సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. "హైదరాబాద్ రూపురేఖలను శంషాబాద్ విమానాశ్రయం ఎలా మార్చేసిందో, అదే తరహాలో భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఇది కేవలం రవాణా సౌకర్యమే కాకుండా పర్యాటకం, పారిశ్రామికాభివృద్ధి మరియు విశాఖ ఎకనామిక్ రీజియన్ వృద్ధికి ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది" అని పేర్కొన్నారు.
విమానాశ్రయం లోపలి భాగాలు ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, కళా వైభవాన్ని ప్రతిబింబించేలా ఉండాలని సీఎం ఆదేశించారు. అలాగే ప్రారంభోత్సవ వేడుకల్లో స్థానిక గిరిజన సాంప్రదాయాలు, హస్తకళల ప్రదర్శనలు ఉండేలా చూడాలని, విద్యార్థులు, యువతతో సహా ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
"ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనున్న ఈ ప్రారంభోత్సవం ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోవాలి. స్వాగత ఏర్పాట్లు ఆ ప్రాంత గిరిజన సంప్రదాయాలను, హస్తకళలను ప్రతిబింబించేలా ఉండాలి. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఉత్తరాంధ్రలోని ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడు సంబరంగా జరుపుకోవాలి. ఈ విమానాశ్రయం పట్ల ప్రతి నివాసి గర్వపడాలి. ఈ ప్రారంభోత్సవం మొత్తం ప్రాంతానికే ఒక పండుగలా మారేలా, ప్రజల భాగస్వామ్యాన్ని…. ముఖ్యంగా విద్యార్థులు మరియు యువత భాగస్వామ్యాన్ని - ప్రోత్సహించాలి" అని సీఎం సూచించారు.
{{/usCountry}}"ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనున్న ఈ ప్రారంభోత్సవం ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోవాలి. స్వాగత ఏర్పాట్లు ఆ ప్రాంత గిరిజన సంప్రదాయాలను, హస్తకళలను ప్రతిబింబించేలా ఉండాలి. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఉత్తరాంధ్రలోని ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడు సంబరంగా జరుపుకోవాలి. ఈ విమానాశ్రయం పట్ల ప్రతి నివాసి గర్వపడాలి. ఈ ప్రారంభోత్సవం మొత్తం ప్రాంతానికే ఒక పండుగలా మారేలా, ప్రజల భాగస్వామ్యాన్ని…. ముఖ్యంగా విద్యార్థులు మరియు యువత భాగస్వామ్యాన్ని - ప్రోత్సహించాలి" అని సీఎం సూచించారు.
{{/usCountry}}