Summer Special Trains : రైల్వే ప్రయాణికులకు అలర్ట్ - కాజీపేట, విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, ఇవిగో వివరాలు
SCR Summer Special Trains : వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కాజీపేట - నిజాముద్దీన్, విజయవాడ - ఫరీదాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్ల సమయాలు, హాల్టింగ్ స్టేషన్ల వివరాలు ఇక్కడ చూడండి.
SCR Summer Special Trains : వేసవి సెలవుల దృష్ట్యా రైళ్లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తరాదికి వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం కాజీపేట - నిజాముద్దీన్ మరియు విజయవాడ - ఫరీదాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ ప్రత్యేక సర్వీసులు ప్రయాణికులకు ఎంతో ఊరటనివ్వనున్నాయి.

కాజీపేట – నిజాముద్దీన్ : కాజీపేట నుంచి నిజాముద్దీన్ వెళ్లే రైలు (నెం. 07662) మే 22, 2026 (శుక్రవారం) మధ్యాహ్నం 13.10 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు శనివారం రాత్రి 23.40 గంటలకు నిజాముద్దీన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నిజాముద్దీన్ - కాజీపేట రైలు (నెం. 07663) మే 25, 2026 (సోమవారం) తెల్లవారుజామున 03.40 గంటలకు బయలుదేరి…. మంగళవారం ఉదయం 11.00 గంటలకు కాజీపేట చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు బలార్షా, చంద్రపూర్, సేవగ్రామ్, నాగ్పూర్, భోపాల్, ఝాన్సీ మరియు ఆగ్రా కాంట్ స్టేషన్లలో రెండు దిశలలోనూ ఆగుతాయి. ఈ రైళ్లలో స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు అందుబాటులో ఉంటాయి.
విజయవాడ – ఫరీదాబాద్ : విజయవాడ నుంచి ఫరీదాబాద్ వెళ్లే ప్రత్యేక రైలు (నెం. 07664) మే 22, 2026 (శుక్రవారం) తెల్లవారుజామున 05.10 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు శనివారం మధ్యాహ్నం 14.50 గంటలకు ఫరీదాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఫరీదాబాద్ - విజయవాడ రైలు (నెం. 07665) మే 25, 2026 (సోమవారం) తెల్లవారుజామున 01.10 గంటలకు బయలుదేరి… మంగళవారం మధ్యాహ్నం 13.00 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, బలార్షా, నాగ్పూర్, భోపాల్, ఝాన్సీ మరియు ఆగ్రా కాంట్ స్టేషన్లలో ఆగుతాయి. ఇందులో కూడా స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి. ప్రయాణికులు ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ లేదా రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

