SCR Tirupati Charlapalli Weekly Express : తిరుపతి, హైదరాబాద్లోని చర్లపల్లి మధ్య ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. గతంలో ప్రత్యేక రైలుగా నడిచిన తిరుపతి - చర్లపల్లి - తిరుపతి వీక్లీ స్పెషల్ రైలును రెగ్యూలరైజ్ చేసింది. మే 28, 2026 నుంచి రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ గా సర్వీసులను ప్రారంభించనున్నట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది.
- తిరుపతి - చర్లపల్లి వీక్లీ ఎక్స్ప్రెస్ : తిరుపతి నుంచి చర్లపల్లి వెళ్లే ఈ రైలు (ట్రెయిన్ నెం. 17443) వారానికి ఒకరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ రెగ్యులర్ సర్వీస్ 2026 మే 28వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ప్రతి వారం గురువారం సాయంత్రం 16:30 గంటలకు తిరుపతిలో బయలుదేరి….. మరుసటి రోజు శుక్రవారం ఉదయం 08:25 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది.
- చర్లపల్లి - తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్ : తిరుగు ప్రయాణంలో చర్లపల్లి నుంచి తిరుపతి వెళ్లే రైలు (ట్రెయిన్ నెం. 17444) 2026 మే 29వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. ఈ రైలు ప్రతి శుక్రవారం సాయంత్రం 16:20 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి…. శనివారం ఉదయం 07:30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

ఈ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల,ప్రొద్దుటూరు, నంద్యాల, దిగువమెట్ట, గిద్దలూరు, మార్కాపూర్ రోడ్, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి స్టేషన్లు ఉన్నాయి.
ఈ ఎక్స్ప్రెస్ రైలులో అన్ని వర్గాల ప్రయాణికులకు అనుగుణంగా కోచ్లను ఏర్పాటు చేశారు.
- సెకండ్ ఏసీ (2A) - 1 కోచ్
- థర్డ్ ఏసీ (3A) - 3 కోచ్లు
- స్లీపర్ క్లాస్ (Sleeper) - 14 కోచ్లు
- జనరల్ సెకండ్ క్లాస్ (General) - 4 కోచ్లు
వేసవి రద్దీ, సాధారణ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. తిరుపతి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రయాణికులకు ఈ వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు ఎంతో ఊరటనివ్వనుంది.